Top Stories

political-news-img

నీటిలోనే రోజుల తరబడి.. బెంగాల్‌ బాలుడి వింత పరిస్థితి..!

మంట తట్టుకోలేక నీళ్లలోనే వారంలో ఐదు రోజులు..! శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్‌ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఒక విచిత్రమైన, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పదహారేళ్ల బాలుడి ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంటి నిండా అనియంత్రిత మంటలు రావడం వల్ల ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆ టీనేజర్ రోజంతా నీళ్లలోనే గడుపుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దాంగా ప్రాంతానికి చెందిన ఇక్బాల్‌ షేక్‌ అనే 16 ఏళ్ల కుర్రాడు ఈ వింత పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. వారంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇతడు నీటిలోనే మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకుండా వరుసగా వారం రోజులు కూడా స్థానిక చెరువులోనే ఉండిపోతుండటం విశేషం. బాలుడి వింత ప్రవర్తన గురించి ఆరా తీయగా ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి నుంచి బయటకు రాగానే తన శరీరం అంతా విపరీతమైన మంట పుడుతుందని, ఆ తాపాన్ని భరించలేకపోతున్నానని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం చెరువు నీటిలో ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ మంట నుంచి శమనం లభిస్తుందని చెబుతున్నాడు. గత ఐదేళ్లుగా ఇక్బాల్‌ జీవితం ఇలాగే సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. చర్మం దెబ్బతిని వివిధ రకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తుండగా, ఎడతెరిపి లేని జలుబు, తీవ్రమైన దగ్గు అతడిని వేధిస్తున్నాయి. అతని ప్రాథమిక వైద్యం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధి మూలాలను గుర్తించి సరైన చికిత్స అందించడంలో అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరొకవైపు, పేదరికంలో ఉన్న ఇక్బాల్ కుటుంబానికి కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్థాయి లేదు. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన స్థానిక నివాసితులు ఇక్బాల్‌కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించేందుకు ముందుకు వస్తున్నారు. వైద్య నిపుణులు ఈ సమస్యపై స్పందిస్తూ ఇది తీవ్రమైన నడీమండల వ్యవస్థ లేదా చర్మానికి సంబంధించిన అరుదైన వైకల్యం కావచ్చని అంచనా వేస్తున్నారు. బాధితుడిని నగరంలోని పెద్ద ఆసుపత్రికి తరలించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తే తప్ప అసలు కారణం బయటపడదని సూచిస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తక్షణమే స్పందించి బాధితుడికి అవసరమైన వైద్య సహాయం అందిస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు. సరైన చికిత్స లభిస్తే ఈ బాలుడు సాధారణ జీవితంలోకి తిరిగొస్తాడని గ్రామస్థులు నమ్ముతున్నారు. West Bengal strange incident, Iqbal Sheikh pond, Body burning sensation disease, Beldanga rare condition, Iqbal Sheikh

Publish Date: Aug 10, 2026 6:23PM

political-news-img

పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..!

పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది". ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు. అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి. దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి. దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే.. ఇది చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం, సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది. పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. *రూపశ్రీ.

Publish Date: Aug 10, 2026 5:54PM

political-news-img

వైసీపీపై సీఎం చంద్ర నిప్పులు.. : లోకేష్ రాజీనామా డిమాండ్‌పై వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్. !

రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పాల్గొని వైసీపీ వైఖరిపైవిమర్శలు గుప్పించారు. నెలనెలా స్వయంగా ప్రజల వద్దకు వచ్చి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్న చంద్రబాబు జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత, కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. గతంలో నేతల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, తమ ప్రభుత్వంలో నిజమైన యజమానులకే పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఆక్వా రంగానికి ఊరటనిస్తూ, పది ఎకరాల పరిమితి, జోన్ నాన్ జోన్ నిబంధనలను ఎత్తివేసి 1.50 కేనామలకే విద్యుత్ సరఫరా చేసే ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కైకలూరుకు 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఖండించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తే.. కోర్టు కేసులతో అడ్డుపడాలని చూశారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రవర్తించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, గంజాయి సంస్కృతి, రౌడీయిజం రాజ్యమేలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమానికి అడ్డుపడే ఏ శక్తినైనా తిప్పికొట్టి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. Chandrababu Naidu Speeches, AP CM Kalidindi Visit, AP Land Pattadar Passbooks, Aqua Farmers Subsidy, Mega DSC Andhra Pradesh, TeluguOne

Publish Date: Aug 10, 2026 5:43PM

political-news-img

పొటాషియం బ్యాలెన్స్ తప్పితే ప్రమాదమే..రణాలు, లక్షణాలు ఇవే..!

మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

Publish Date: Aug 10, 2026 5:34PM

political-news-img

కాల్వలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి..!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రయాణిస్తున్న మినీ వ్యాన్.. అదుపుతప్పి పొంగిపొర్లుతున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో కాల్వలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి నేరుగా వరద ప్రవాహంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే వాహనం నీటిలో మునిగి కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఉధృతమైన నీటి ప్రవాహం కారణంగా అది సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురైనా.. సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహానికి వ్యాన్ కొంతదూరం కొట్టుకుపోవడంతో మృతదేహాలను వెలికితీయడం సవాల్‌గా మారింది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా.. రోడ్డుపై పరిస్థితులా.. లేక వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో జరిగిన పొరపాటా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలిపారు. భారీ వర్షాల సమయంలో కాల్వలు, వాగులు, బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ప్రమాదకర ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. Rajgarh Accident, Madhya Pradesh Accident, Rajgarh Van Accident, Van Swept Away, Flood Water, Heavy Rains, 11 Passengers, Flood Accident

Publish Date: Aug 10, 2026 5:19PM

political-news-img

దామచర్ల, బాలినేనికి తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ వార్నింగ్.!

ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒం మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ ఇరుురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది. ఈ ఇద్దరు కీలక నేతల వైరం కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా పరస్పరం విమర్శలూ, దూషణలతో రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది. నేతల మధ్య విబేధాలు, సమస్యలు ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై మాట్లాడటంలేదా, అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప.. మీడియా ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది. మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. Balineni Srinivasa Reddy, Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne

Publish Date: Aug 10, 2026 4:53PM

MOVIE NEWS