political-news-img

అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతున్న తీరుపై అధికారులతో మంత్రి నారాయణ శనివారం (25-4-26) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్లు భార్గవ తేజ, కార్తీక్, డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోలు హాజరయ్యారు. ఇంటర్ నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వేలైన్, రైల్వేస్టేషన్ కోసం 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఎంజాయ్‌మెంట్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, లెగసీ వేస్ట్, ఫ్రెష్ వేస్ట్ నిర్వహణ ఏజెన్సీలతో పలు కీలక అంశాలపై మంత్రి నారాయణ చర్చించారు. లెగసీ వ్యర్థాలను త్వరితగతిన పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఫ్రెష్‌వేస్ ప్లాంట్‌ల ఏర్పాటు త్వరగా పూర్తి చేసి వ్యర్థాల నిర్వహణ ప్రారంభించాలని సూచించారు. ప్లాంట్‌ల ఏర్పాటుకు స్థలం ఇబ్బందిగా ఉన్న చోట కలెక్టర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

Publish Date: Apr 25, 2026 9:48PM

political-news-img

హైదరాబాద్‌లో మాజీ మంత్రి కారుమూరిని విచారించిన సిట్

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు శనివారం సుదీర్ఘంగా విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు పాల్గొని, ఆయన స్టేట్మెంట్‌ను అధికారికంగా నమోదు చేశారు. సిట్ ఎస్పీ వివరాల ప్రకారం, కారుమూరి నాగేశ్వరరావు వయసు 60 సంవత్సరాలకు పైబడినందున చట్టబద్ధ నిబంధనల ప్రకారం ఆయన కోరిన ప్రదేశంలోనే విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో ఆయన పూర్తి సహకారం అందించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే భవిష్యత్తులో మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ కేసు ప్రధానంగా మద్యం రవాణా టెండర్లు, సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగినట్లు భావిస్తున్న అవకతవకలపై దృష్టి సారించింది. విచారణలో భాగంగా టెండర్ల జారీ విధానం, సబ్ కాంట్రాక్టుల ఎంపిక, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.అధికారుల అంచనాల ప్రకారం, ఈ అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ కారుమూరిపై కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సునీల్‌ను సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలను చూపుతూ సునీల్ కొంత గడువు కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్పీ వెల్లడించారు. మాజీ మంత్రి స్థాయి వ్యక్తిపై సిట్ విచారణ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ దర్యాప్తు మరింత విస్తరించే అవకాశముందని, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Publish Date: Apr 25, 2026 9:41PM

political-news-img

ఐపీఎల్ రికార్డు ఛేజింగ్... ఢిల్లీపై పంజాబ్ వీరోచిత విజయం!

పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం.. అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేశారు! భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ దాటేశారు: పంజాబ్ కింగ్స్ సెన్సేషన్! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఊహించని రీతిలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. అసాధ్యమనిపించే భారీ లక్ష్యాన్ని కూడా పంజాబ్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించి సంచలనం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశారు. 18.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరడం చూస్తుంటే వారి దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తన దూకుడైన ఆటతీరుతో 76 పరుగులు చేసి, జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. పంజాబ్ బ్యాటర్లు ఆడుతున్న విధానం చూస్తుంటే ఢిల్లీ బౌలర్లు ఏ దశలోనూ ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ప్రభ్ సిమ్రన్ ఔటైన తర్వాత కూడా పంజాబ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అర్థసెంచరీతో మెరిసిన అయ్యర్, పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. నిలకడగా ఆడుతూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐపీఎల్ వంటి టోర్నీలలో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం మాటలు కాదు. అదీ కూడా నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే లక్ష్యాన్ని చేరుకోవడం పంజాబ్ జట్టు సామర్థ్యానికి నిదర్శనం. ఈ విజయం పంజాబ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని భారీగా పెంచడం ఖాయం. క్రీడా విశ్లేషకులు సైతం పంజాబ్ బ్యాటింగ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఐపీఎల్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్తాయని, రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే జోరు కొనసాగిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో గట్టి పోటీ ఇస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఈ భారీ విజయంతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. తదుపరి మ్యాచ్‌లలో ప్రత్యర్థులు పంజాబ్ బ్యాటర్ల దూకుడును ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Publish Date: Apr 25, 2026 9:06PM

political-news-img

సీబీఎన్ కీర్తి కిరీటంలో మరో కలికితు రాయి

ముంబైలో సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది. తాజాగా ఆయన ముంబై వేదికగా ప్రతిష్టాత్మకమైన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. ఆ విజనరీ లీడర్‌కు అవార్డులు కొత్తమీ కాదు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. పలు ప్రముఖ పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. ‘ఐటీ ఇండియన్‌ ఆఫ్‌ ద మిలేనియం’గా, ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘సౌత్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వంటి బిరుదులతో సత్కరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్‌ చంద్రబాబును ‘హిడెన్‌ సెవెన్‌ వర్కింగ్‌ వండర్స్‌’లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ ‘సైబర్‌ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ‘సీఈఓ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ప్రశంసించింది. ఇక ఇఫ్పుడు ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ఎకనమిక్ టైమ్స్' సీఎం దార్శనికతకు, పాలనా సంస్కరణలకు గుర్తింపుగా 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, సులభతర వాణిజ్యంలో చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డును అందించింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీని కీలక భాగస్వామిగా మలిచినందుకు సీఎంకు ఈ గౌరవం దక్కింది. ముంబై పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణకు మరింత బలాన్ని చేకూర్చనుందని అధికారులు అంటుండటం విశేషం.

Publish Date: Apr 25, 2026 8:56PM

political-news-img

ప్రభుత్వ గూటికి హైదరాబాద్ మెట్రో...నూతన చైర్మన్‌గా సీఎస్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన పట్టును మరింత బిగించింది. నగరం నలుమూలల విస్తరించి ఉన్న ఈ మెట్రో వ్యవస్థపై పూర్తిస్థాయి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో నిర్వహణ మరియు కీలక నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం మరింత పెరగనుంది. ఈ మార్పులో భాగంగా, హైదరాబాద్ మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణరావు ఇకపై మెట్రోకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకం ద్వారా ప్రభుత్వ మరియు మెట్రో సంస్థ మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రైవేట్ భాగస్వామ్యం ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. అయితే, పెరుగుతున్న నగర అవసరాలు మరియు మెట్రో వినియోగదారుల పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ రవాణా వ్యవస్థను పర్యవేక్షించడంలో ప్రభుత్వ పర్యవేక్షణ అత్యవసరమని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారికి నేరుగా బాధ్యతలు అప్పగించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో మరియు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంతకాలంగా మెట్రో విస్తరణ, టికెట్ ధరలు మరియు సౌకర్యాల పట్ల ప్రజల్లో ఉన్న కొన్ని ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ పెరగడం వల్ల మెట్రో సేవల విస్తరణ వేగవంతం కావచ్చని ఆశిస్తున్నారు. ఇప్పటికే నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో, మెట్రోను మరింత మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టును, పరిపాలనా పరంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో మెరుగైన రవాణా సదుపాయాలు అందుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం వల్ల మెట్రో సేవల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెట్రో సంస్థను మరింత బలోపేతం చేస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.

Publish Date: Apr 25, 2026 8:46PM

political-news-img

మా బండినే ఆపుతారా.... టోల్ గేట్ సిబ్బందిపై...ఎమ్మెల్యే అనుచరులు దాడి!

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ఫీజు చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం కాసేపట్లోనే ఘర్షణకు దారి తీసింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపడంతో ఆగ్రహానికి గురైన అనుచరులు “మా బండినే ఆపుతారా?” అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం క్రమంగా హింసాత్మకంగా మారి, టోల్ బ్యారియర్‌ను ఎమ్మెల్యే గన్‌మ్యాన్ విరగ్గొట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో టోల్ ప్లాజా మేనేజర్ రవి సహా పలువురు సిబ్బందిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. మహిళా సిబ్బందిని కూడా వదలకుండా దాడి చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొంతమంది మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మేనేజర్ రవిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఘటన సమయంలో టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Publish Date: Apr 25, 2026 8:33PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img