దీక్ష విరమించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు..!

Publish Date:Aug 25, 2026

Advertisement

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, నిమ్మరసం ఇచ్చి రాంచందర్ రావు చేత ఈ పోరాట దీక్షను ముగించేలా చేశారు.

"ఫీజు బకాయి - బీజేపీ లడాయి" పేరిట హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగింది. రాష్ట్రంలో పేరుకుపోయిన రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వం బలంగా డిమాండ్ చేసింది. దీక్షా వేదికపై పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో తీవ్ర అలసత్వం వహిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో వేలాది మంది ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన బకాయిలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల బీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని నేతలు విమర్శించారు.

ఈ పోరాటానికి విద్యార్థి సంఘాలు, వివిధ కాలేజీల యాజమాన్యాలు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు సైతం సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, యజమానులు తమ ఇబ్బందులను రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఈ దీక్షపై స్పందించిన అధికార కాంగ్రెస్ వర్గాలు, పాత బకాయిలను విడతలవారీగా తీరుస్తున్నామని, దీక్షల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించాయి.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ క్లిష్టమైన సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయకపోతే, భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Fee dues BJPs fight, BJP state chief Ramchandra Rao, MP K. Lakshman, BJYM,  BJP State Office Nampally, Fee Reimbursement Dues, Hyderabad Hunger Strike

By
en-us Political News

  
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
విద్యార్థుల హక్కులు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో  రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాంపల్లి పరిసరాల్లో ఒక్క సారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు.
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.