కరువు ప్రాంతాల్లో నకిలీనోట్ల చెలామణి?
Publish Date:May 16, 2012
Advertisement
రాష్ట్రంలో కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ఇటీవల వరకూ గుర్తించిన ప్రదేశాల్లో నకిలీనోట్ల చెలామణి యథేచ్చగా సాగుతోంది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణాలోని మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు నకిలీనోట్ల చెలామణికి అడ్డాగా మారుతున్నాయి. ఈ నకిలీనోట్లను మహారాష్ట్రలో ముద్రించి తీసుకువస్తున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అక్కడ ముద్రించటమే కాకుండా విదేశీయులు కూడా ముఠాలుగా ఎపడి వీటిని రవాణా చేస్తున్నారని సమాచారం. అలానే సంతలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ఈ నోట్లు చెలామణి సాగుతోందని తెలుస్తోంది. ఎటిఎంల్లో కూడా నకిలీ నోట్లు వస్తున్నాయి. మెదక్ జిల్లా బల్లారంలోనూ నకిలీనోట్ల చెలామణి సాగుతోంది. మంజీరా గ్రామీణబ్యాంకుకు వెళ్ళిన ఓ ఖాతాదారుడు ఇచ్చిన నోట్లలో ఒకదాన్ని నకిలీదని గుర్తించిన అకౌంటెంట్ దాన్ని రెడ్ ఇంకుతో కొట్టేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఖాతాదారునికి విషయం చెప్పి ఆ నోటు తిరిగి ఇచ్చేశారట. అలానే అక్కడికి సమీపంలోని ఎటిఎంల్లో నకిలీ, దొంగనోట్లు వస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరులోనూ రూ.500 నకిలీనోట్లు చెలామణి జరుగు తోంది. ఇక్కడ నాపరాళ్ళు, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలోనూ ఈ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లు బ్యాంకుకు చేరాక కానీ ప్రజలు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ నోట్లను పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారు రవాణా చేస్తున్నారని పోలీసులు ధ్రువీకరించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ లోనూ ఇదే తరహాలో పశ్చిమబెంగాల్ కు చెందిన ముగ్గురు పోలీసుల చేతికి చిక్కిన విషయం తెలుగువన్.కామ్ రీడర్స్ కు తెలిసిందే. ఇలా కరువుప్రాంతాలపై కన్నేసిన ఈ ముఠాలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/fake-notes-circulating-in-draught-areas-24-14075.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





