ఉత్సాహాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆరోపణలు
Publish Date:May 16, 2012
Advertisement
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి, పిసిసి నేత బొత్స సత్యనారాయణ, చిరంజీవి ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని, అవినీతికి చిరునామా జగన్ అంటూ ముఖ్యమంత్రి విమర్శలతో విరుచుకుపడటం ప్రజలలో ఆలోచన కలిగిస్తోంది. నిన్నమొన్నటి వరకూ జగన్ పై ఎటువంటి విమర్శ చేయని, లక్ష చదరపు అడుగుల్లో ఇళ్ళు ... 75 పడకగదులతో ఇళ్ళు కట్టుకున్న జగన్ పదవికోసం వెంపర్లాడుతున్నాడంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో నేరుగా జగన్ పై విరుచుకుపడటం, నేతలు ముగ్గురూ కలిసి ప్రచారం చేయడం ఓటర్లలో మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిననాటి నుండి జగన్ ను పల్లెత్తు మాట కూడా అనని కిరణ్ నేడు తీవ్రమైన స్థాయిలో జగన్ పై ఆరోపణలు చేయకపోతే తన రాజకీయమనుగడ వుండదని ఆయన గుర్తించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు కిరణ్ అత్యంత సన్నిహితుడని, నిజానికి కిరణ్ ప్రభుత్వం వైఎస్ జగన్ కు కోవర్టుగా పనిచేస్తోందన్న ఆరోపణలు నిజమనే భావన ప్రజలలో కలగడమే కాకుండా చివరకు అధిస్థానం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కు పదవీగందం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో పదవిని కాపాడుకోవాలంటే ఉప ఎన్నికల్లో జయాపజయాల సంతతి ఎలా వున్నప్పటికీ కనీసం తాను జగన్ కు కోవర్టును కాననే విషయాన్ని అయినా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి కిరణ్ కు ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఆయన జగన్ పై విమర్శలు సంధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు జగన్ కోవర్టుగా భావించిన కిరణ్ కూడా స్వయంగా జగన్ అవినీతిని, విలాసవంతమైన భవనాల గురించి ప్రస్తావించడం ఆ ప్రభావం ఎంతోకొంత ఓటర్లపై చూపిస్తుందని భావించినట్టుగానే ఓటర్లలో మార్పు కనిపిస్తున్నట్టుగా భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-cadre-recharged-24-14076.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





