మన దేశానికి రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి కావాలా?

Publish Date:May 4, 2012

Advertisement

దేశ 13వ రాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. జులై 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం వున్న రాజకీయ వాతావరణంలో అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నిక అవుతారా? అనే సందేహం నెలకొని వుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కాంగ్రెస్, బిజెపి కూటములు తమతో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

 

ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎ.కె. ఆంటోని చెన్నై వచ్చి యు.పి.ఎ.-2 ప్రభుత్వంలో భాగస్వామి అయిన డి.ఎం.కె. నేత కరుణానిధితో సంప్రదింపులు జరిపి వెళ్ళారు. వీరిమధ్య చర్చల సారాంశం వెల్లడి కాకపోయినప్పటికీ ఇరుపక్షాలు ఒకే అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశాలే వున్నాయి. రాష్ట్రపతి పదవి ప్రధానమంత్రి లేదా ఇతర రాజకీయ పదవుల వలె క్రియాశీలకమైనది కాకపోయినప్పటికీ అత్యున్నతమైన పదవి. రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రపతి బాధ్యత, త్రివిధదళాల అధిపతి కూడా రాష్ట్రపతే. పార్లమెంటు చేసే చట్టాలకు ఆమోదం తెలియచేయడమే కాక అవసరమైతే చట్టాలను మరోసారి సమీక్షించాలని తిరస్కరించే పనిని కూడా రాష్ట్రపతి చేస్తారు. అందువల్ల రాజ్యాంగపరమైన అంశాలో లోతైన అవగాహనతో పాటు రాజకీయపరమైన మతలబులు, మెళకువలు తెలిసివుంటే సంక్షోభ సమయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగం, రాజనీతిజ్ఞత, మచ్చలేని కుటుంబ నేపథ్యం వున్న పరిపాలనా దక్షులను మాత్రమే ఎన్నుకొన్న సందర్భాలు వున్నాయి.

 

ఇందిరాగాంధీ చెబితే చీపురు పట్టుకొని వీథిని శుభ్రం చేస్తానని రాష్ట్రపతిగా పనిచేసిన జ్ఞానీజైల్ సింగ్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కు రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి అనే పరు ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి గుణాలు గల వ్యక్తినే రాష్ట్రపతిగా నియమించడానికి ప్రయత్నిస్తున్నడన్న వార్తలు వస్తున్నాయి.

 

 

 

మనకిప్పుడు ఫకృద్దీన్ ఆలీ అహ్మద్, జ్ఞానీజైల్ సింగ్ లాంటి వ్యక్తులకు కొదవలేదు. ఇలాంటివారు రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకురారు. మనకు కావలసింది ఇప్పుడు కె.ఆర్. నారాయణ్ లాంటి వ్యక్తులు రాష్ట్రపతిగా ఎన్నికకావాలి. ఎందుకంటే ఐ.కె. గుజ్రాల్ ప్రధానమంత్రిగా వున్న సమయంలో ఉత్తరప్రదేశ్, ఎన్.డి.ఎ. ప్రబుత్వహయాంలో బీహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా అందుకు నారాయణ్ తిరస్కరించారు. రాష్ట్రపతి పాలనకు అవసరమైన పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో లేవని నారాయణ్ సాధికారికంగా వివరించి, తిరస్కరించగలిగారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన నేతలు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అవసరం.

By
en-us Political News

  
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.