అన్నపై ఎదురుదాడికి దిగిన ధర్మాన

Publish Date:Apr 18, 2012

Advertisement

శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట ఉపఎన్నికలు ధర్మానసోదరులు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున తాజా మాజీ, ధర్మాన కృష్ణదాస్ పోటి చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ తరుపున చిన్నసోదరుడు ధర్మాన రామదాసు తలపడుతున్నారు. నిన్న మొన్నటి వరుకూ తన తమ్ముడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుపై అన్న కృష్ణదాసు ఒంటికాలిపై లేస్తూ చిటికిమాటికి విమర్శలు గుప్పించేవారు. తమ్ముడు తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సీను మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన అన్నగారిపై విమర్శనాస్త్రలను సందిస్తున్నారు. కేవలం పదవికాంక్షతోనే ధర్మాన కృష్ణదాస్ జగన్ పంచన చేరారని అంటున్నారు. నరసన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడన్నఉద్దేశ్యంతోనే గత ఎన్నికల్లో కృష్ణ దాసుకు టికెట్టు ఇప్పించి గెలిపించానని,కానీ ఆయన విశ్వసఘతకానికి పాల్పడి నరసన్నపేట ప్రజలను నట్టేట ముంచారని ధర్మానప్రసాదరావు ఆరోపిస్తున్నారు. కృష్ణదాసు ఆలోచనతీరు సరిగాలేదని విమర్శించారు. ఆయనను మళ్ళీ గెలిపిస్తే నియోజకవర్గ ఓటర్లను మరోసారి మోసం చేయరనే గ్యారెంటి ఏమి లేదని అయన హెచ్చరిస్తున్నారు. నియోజక వర్గ౦ అన్ని రంగాలలో అభివృద్ధి సాధీంచాలంటే కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని అయన వోటర్లను కోరుతున్నారు. సోదరుల మధ్య ఏర్పడిన ఈ రాజకీయ చిచ్చు కుంటుంబ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.