జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనాన్నివ్యయం చేసి నిర్మించిన అత్యంత విలాలవంతమైన, అంతకు మించి వివాదాస్పదమైన రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఉత్కంఠకు తెరపడిందా? ఈ విలాసవంతమైన భవనాన్ని ప్రస్తత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించనుందా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి, పర్యావరణ సమతుల్యతకు భగం వాటిల్లేలా పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది.
ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో రూ. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్స్ ద్వారా ప్రభఉత్వానికి 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. కానీ వాటిని కూల్చివేసి ఈ ప్యాలెస్ను నిర్మించడంతో ఆ ఆదాయం లేకుండా పోవడమే కాకుండా.. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ వ్యయమే నెలకు పాతిక లక్షల రూపాయలకు పెగా ఉంది.
ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ హోటల్ చైన్స్కు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలుఈ దిశగా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా ప్రపంచస్థాయి రిసార్ట్స్గా మార్చడం ద్వారా అటు పర్యాటకాన్ని అభివృద్ధితో పాటు, ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కమిటీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా భేటీలో కమిటీ చర్చించిన విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో సమర్పించాలని కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-subcommittee-onrushikonda-palace-to-submitt-reoprt-36-216855.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.