బకాయి మిల్లర్ల పై ఉక్కుపాదం.. రంగంలోకి 28 మంది కమాండోలు..!

Publish Date:Aug 21, 2026

Advertisement

 

రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా బకాయి పడిన మిల్లర్లపై కఠిన చర్యలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది అత్యుత్తమ కమాండోలను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగంలోకి నియమించింది. వీరితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ శుక్రవారం సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొత్తగా విధుల్లో చేరిన కమాండోలకు స్వాగతం పలికిన ఆయన.. వారికి అప్పగించిన బాధ్యతలు, శాఖ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. 

పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై కమాండోలకు ఇప్పటికే మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై తెలంగాణ పోలీస్ అకాడమీలోనూ వారికి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. గత సీజన్‌ KMS 2025-26లో 154 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించినట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి సేకరణ అని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ప్రభుత్వం రైతుల నుంచి భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అప్పగించిన నేపథ్యంలో, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి బియ్యం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో బకాయిలు ఉన్న మిల్లర్లపై ఇక క్షేత్రస్థాయిలో నిఘా, తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు.ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి తనిఖీల్లో ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోల సామర్థ్యాన్ని ఇకపై పౌర సరఫరాల శాఖ వినియోగించుకోనుంది.

 ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగం పరిధిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా వీరు పనిచేయనున్నారు. బకాయి ఉన్న మిల్లర్ల వద్దకు వెళ్లి నిల్వలు, రికార్డులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం తదితర అంశాలపై తనిఖీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించడం, పౌర సరఫరాల శాఖ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన మిల్లర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతుల నుంచి ప్రభుత్వం భారీగా సేకరించిన ధాన్యం ప్రజలకు చేరాల్సిన బియ్యంగా మారే ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యంగా ఈ ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి. కమాండోల రంగప్రవేశంతో బకాయి మిల్లర్లలో ఆందోళన మొదలైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telangana Civil Supplies Department, arrears millers, Stephen Ravindra, Greyhounds, octopus, Minister uttam kumar reddy

By
en-us Political News

  
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
డిమాండ్ల సాధన కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీలో సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆమె నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.  ఖర్గేతో దాదాపు పావుగంట పాటు భేటీ అయిన సురేఖ్.. తాను సీఎం రేవంత్ రెడ్డికి కానీ, ఆయన కుటుంబానికి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని కొండా సురేఖ ఈ సందర్భంగా ఖర్గేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  
గాంధీ భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్‌కానా వద్ద ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్..!
సరూర్‌నగర్ స్టేడియంలో క్రికెట్ కోచ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది.
ప్రియురాలికి కిడ్నాప్ మెసేజ్ పంపడంతో బట్టబయలైన వ్యవహారం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.