చంద్రబాబు పర్యవేక్షణలో రాజధాని నిర్మాణం?

Publish Date:Sep 19, 2014

Advertisement

 

ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మూడు కమిటీలు వేయబడ్డాయి. కొత్తగా రాజధాని అభివృద్ధి మండలి ఒకటి ఏర్పాటు చేయబడింది. అయితే రాజధాని నిర్మాణం కోసం ఇన్ని కమిటీలు ఎందుకని ప్రతిపక్షాల ప్రశ్న.

 

దానికి సంబంధిత అధికారులు చెపుతున్న సమాధానం ఏమిటంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ కేవలం రాజధాని ఏవిధంగా నిర్మింపబడితే బాగుంటుంది, అందులో సాధకబాధకాలను వివిధ నగరాలలో పర్యటించడం ద్వారా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడంతో దాని పని పూర్తవుతుంది.

 

అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు, శాసనసభ్యులతో కూడిన కమిటీ కేవలం భూసేకరణకే పరిమితమవుతుంది. భూసేకరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆ కమిటీ కృషి చేస్తుంది. భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికే ఆ కమిటీ పరిమితమవుతుంది. అన్నిటి కంటే అదే సంక్లిష్టమయిన వ్యవహారం కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక మంత్రులు, శాసనసభ్యులను ఆ కమిటీలో వేసారు.

 

ఇక ఆర్ధిక, మున్సిపల్ మరియు రవాణా శాఖల ప్రధాన కార్యదర్శులతో వేసిన మరో కమిటీ హైదరాబాదు నుండి ప్రధాన ప్రభుత్వ శాఖలను ఏవిధంగా, ఎంత కాలంలో విజయవాడకు తరలించాలి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు, అందులో సాధకబాధకాలు, వివిధ శాఖలకు, అందులో పనిచేసే సిబ్బందికి, అధికారులకు విజయవాడలో ఎక్కడెక్కడ కార్యాలయాలు, ఇళ్ళు కేటాయించాలి? వాటి లభ్యత వంటి విషయాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వడానికే పరిమితమవుతుంది. కనుక ఈ త్రిసభ్య కమిటీ రాజధాని నిర్మాణంతో ఎటువంటి సంబంధమూ ఉండదు.

 

ఇప్పుడు కొత్తగా వేయబడిన రాజధాని అభివృద్ధి మండలి మాత్రమే రాజధాని నిర్మాణంలో పూర్తి బాధ్యత వహిస్తుంది. ముఖ్యమంత్రి లేదా ఒక ఐఏయస్. అధికారి నేతృత్వంలో అనిచేసే కమిటీ, రాజధాని నిర్మాణం కోసం టెండర్లు పిలవడం, వాటి పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మండలి కనుసన్నలలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పవచ్చును. అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం కేంద్రం విడుదల చేయబోయే భారీ నిధులు కూడా ఈ మండలి ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ఏవిధంగా, ఎప్పుడు ఎంత ఖర్చు చేయాలనే దానిపై ఈ మండలిదే తుది నిర్ణయం. ఇక అందులో ఇక వేరెవరి పాత్ర ఉండబోదు.

 

అయితే ఇటువంటి కీలకమయిన బాధ్యతలు నిర్వహించే మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడుగా ఉండాలని కొందరు మంత్రులు అభిప్రాయపడుతుంటే, ఇంత భారీ నిధులను ఖర్చు చేస్తునప్పుడు, అందులో భారీ అవినీతి జరిగిపోతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది కనుక సమర్దుడు, నిజాయితీపరుడు అయిన ఒక ఐఏయస్. అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇంత భారీ నిర్మాణ కార్యక్రమానికి ఇంత అధ్యయనం, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనని ఎవరయినా అంగీకరిస్తారు.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.