క్షీర సాగర మథనంలో అమృతం పుట్టినట్లుగా ట్రంప్ సుంకాల సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొంటే భారత్ కు కూడా అమృతం వంటి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నదుగ్ధతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలను 50 శాతానికి పెంచడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలనీ, ఇందు కోసం ఇండియా బలంగా రెండు అడుగులు ముందుకు వేయాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రారంభించిన టారిప్ వార్ తీవ్ర పరిణామాలకు దారి తీసు అవకాశాలున్నాయన్న ఆయన.. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ట్రంప్ టారిఫ్ వార్ ను ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదును పెట్టాయనీ, ఫలితంగా ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయన్నారు.
భారత్ కూడా ఈ సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలన్నారు. 1991లో భారత్ లో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభం లిబరలైజేషన్ దారి తీసిందనీ, అలాగే ఇప్పుడు ట్రంప్ సుంకాల కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులను నుంచి బయటపడి కొత్త అవకాశాలకు బాట ఏర్పడుతుందనీ అన్నారు. ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సత్వరమే మెరుగుపరచాలని సూచించారు. అలాగే టూరిజం రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anand-mahindra-on-trump-tariff-war-39-203705.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.