మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడిచిందో లేదో.. తాను ఇంత కాలం ఉన్న పార్టీపై, ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను స్వార్థజీవిగా అభివర్ణించారు. కేసీఆర్ స్వార్థానికి తాను బలయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి కేసీఆర్ అసమర్ధ నాయకత్వమే కారణమని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎక్కడికక్కడ రాజీపడి పార్టీ భవిష్యత్ ను, తన వంటి నాయకుల రాజకీయ భవిష్యత్ ను నాశనం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాను అమ్ముడుపోయానని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ, అయితే అది పూర్తి అవాస్తవమని గువ్వల బాలరాజు అన్నారు. ఈ గువ్వల బాలరాజు ఒకరి మోచేతి నీళ్లు తాగే రకం కాదన్నారు. తాను వంద కోట్లకు అమ్ముడు పోయానంటున్న వారు ఆధారాలు చూపి నిరూపిస్తే ముక్కు నులకు రాస్తాననీ, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని సవాల్ చేశారు.
తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ మీద గౌరవంతోనే బీఆర్ఎస్ లో చేరాన్న గువ్వల.. కేసీఆర్ స్వార్థజీవిగా మారడంతోనే ఆయనను వదిలేశానని చెప్పారు. గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా విపక్ష నేతగా కేసీఆర్ తన పాత్రను సమర్ధంగా పోషించడం లేదనీ, ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీని గాలికొదిలేశారన్నారు. ప్రజల తరఫున గళమెత్తాలనే బీఆర్ఎస్ నుంచి వైదొలిగాన్న గువ్వల.. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయం త్వరలో వెల్లడిస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mla-guvvala-balaraju-fires-on-kcr-39-203708.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.