Publish Date:Apr 18, 2026
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, పొగాకు ముప్పును మూలంలోనే అరికట్టాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీసులు శనివారం నగరవ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరిట భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. సుమారు 5 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్లో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పొగాకు అలవాటు డ్రగ్స్ వైపు నడిపించే మొదటి మెట్టు అన్న అవగాహనతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు క్రమంగా వ్యసనాల బారిన పడుతున్నారన్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కలిసి నగరంలోని 558 షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.
సీపీ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలు చిరాగ్ అలీ లేన్,రెడ్ హిల్స్, మెహదీపట్నం, గోషా మహల్ వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలోని దుకాణాలను పరిశీలించారు.గోషామహల్ ఎంజే బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ, మైనర్లకు పొగాకు అమ్మే వారిపై “ఉక్కుపాదం” మోపుతామని హెచ్చరించారు. డెకాయ్ ఆపరేషన్లో చిన్నారులకు పొగాకు విక్రయిస్తున్నట్లు ఆధారాలతో బయటపడిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీపీ ప్రకటించారు. విద్యాసంస్థల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ పోరాటం కేవలం పోలీసులదే కాదని, తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లల ప్రవర్తన, స్నేహితులు, స్కూల్ తర్వాత కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 8712661601కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-huge-special-drive-called-operation-safe-school-36-217705.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.