ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభించిన మంత్రి పొంగులేటి..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా, పారదర్శకంగా ప్రారంభమైంది. ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులకు తావులేకుండా కేవలం ప్రజా సమక్షంలో లక్కీ డ్రా పద్ధతి ద్వారా అర్హులకు ఇళ్లను కేటాయిస్తున్నారు. హైదరాబాద్ క్యూర్ (GHMC/HMDA) పరిధిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ లక్కీ డ్రా కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు శుభవార్త అందించారు.

నాంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఈ ప్రత్యేక లక్కీ డ్రా పండుగ వాతావరణంలో జరిగింది. మొదటి దఫా కింద ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకు అందించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వరుసగా 4 రోజుల పాటు లక్కీ డ్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ ఇళ్ల కేటాయింపులో కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ పార్టీల ప్రసక్తి లేదని, కేవలం పేదరికం, అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూడటమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తోందని మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా స్థలాలను సేకరించి, దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేశారు. మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ 16 నియోజకవర్గాల్లో భారీ ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తారని ప్రకటించారు. వేగవంతమైన నిర్మాణ సాంకేతికతతో సరిగ్గా ఏడాది వ్యవధిలోనే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులైన ఇంటి ఆడబిడ్డల పేరుమీదే ఇళ్లను పట్టాలుగా అందిస్తామని ప్రభుత్వం మాటిచ్చింది.

ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం అయ్యే ఖర్చులను పేదలు భరించడం కష్టమని భావించి, ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా లబ్ధిదారులకు ఆర్థిక రక్షణ, ఆస్తి హక్కులు కల్పిస్తూ కీలక నిర్ణయం ప్రకటించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అత్యవసర అవసరాల కోసం ఈ ఇళ్లను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టుకునే వెసులుబాటును, అలాగే 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ ఇల్లును అమ్ముకునే సంపూర్ణ హక్కును లబ్ధిదారులకు కల్పిస్తున్నారు.

మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక విజయవంతంగా కొనసాగుతుండగానే, ఇల్లు రాని పేదలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరో 10 రోజుల్లోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అంది తీరుతుందని, ఇది కేవలం పథకం మాత్రమే కాదని, పేద కుటుంబాల ఆత్మగౌరవ ప్రతీక అని ఉద్ఘాటించారు. పారదర్శక లక్కీ డ్రాతో నిజమైన పేదలకు నివాసాలు దక్కుతుండటంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

 

 Indiramma Towers Lottery, Ponguleti Srinivas Reddy, Telangana Indiramma Indlu, Indiramma Housing Scheme, GHMC Housing Lucky Draw, Telangana Free Housing Scheme
 

By
en-us Political News

  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
సీఎం రేవంత్‌తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
యశోద ఆస్పత్రిలో గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాకు విజయవంతంగా స్టెంట్ అమరిక..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.