టూరిస్ట్ డెస్టినేషన్ గా మీర్ ఆలం చెరువు.!

Publish Date:Aug 28, 2026

Advertisement

హైదరాబాద లోని మిర్ ఆలం చెరువుకు సరికొత్త రూపునిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పాతబస్తీ ప్రాంతంలోని ఈ  జలాశయాన్ని నీటి వనరుగానే కాకుండా, కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించే  పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు   చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గురువారం (ఆగస్టు 27)  ఆకస్మికంగా తనిఖీ చేసి, సమీక్షించారు.

మహానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.  ఈ సందర్భంగా నిర్దేశిత కాలంలో  నిర్మాణాలు  పూర్తి చేయాలని   ఆదేశాలు జారీ చేశారు.

ఈ   అభివృద్ధి కార్యక్రమాలు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో   సాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక వినోద వసతుల కల్పనే ధ్యేయంగా మూడు  అంశాలపై దృష్టి సారించారు. జలాశయ పునరుజ్జీవనం, చుట్టుపక్కల ప్రాంతాలు, వాటిలోని   ఐలాండ్ల బ్యూటిఫికేషన్,  చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల డీపీఆర్ తుది దశకు వచ్చింది.   

ఇక యువతను ఆకట్టుకునేలా  వాటర్ స్పోర్ట్స్ , సాహస క్రీడలకు  ప్రాధాన్యత ఇవ్వాలనీ, అలాగే   పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు లోబడి బోటింగ్, ఇతర అడ్వంచరస్ కార్యకలాపాలను ప్రారంభించేలా డిజైన్లు సిద్ధం చేయాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.    చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లను ప్రకృతి సిద్ధమైన విశ్రాంతి వేదికలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

కాగా  మిర్ ఆలం ట్యాంక్‌ను పక్కనే ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కుతో అనుసంధానించడం ద్వారా.. జూ పార్కును సందర్శించడానికి వచ్చే వేలాది మంది పర్యాటకులు అదే ప్రయాణంలో మిర్ ఆలం చెరువు అందాలను, వాటర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదించేలా ఒకే ప్యాకేజీ తరహా అనుభూతిని అందించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఉండటం వల్ల విదేశీ పర్యాటకులను సైతం ఈ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి 

Meer alam as Tourist destination,  CM Revanth Reddy, Meer Alam Tank Development, Hyderabad Tourism, Iconic Suspension Bridge, Telugu One

By
en-us Political News

  
స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్ రెడ్డి లట్టుపల్లి చొరవ, సహకారంతో   ఆయన అమెరికా   ఫిలడెల్ఫియాలో ఉన్న మోంగ్ కుల్ తెప్ మునీ  బౌద్ధ విహార, ఫొషో బౌద్ధలయం సందర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వీరన్నకు సహకరించిన వ్యక్తులు ఎవరు, చట్టం కళ్లుగప్పి.. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు అన్న విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు. దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో  ఎలా కొలువుదీరాడనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.