భర్తకి తెలియకుండా భార్య అలా చేసిందా.. ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -136 లో... ధన ఇంటికి డ్రింక్ చేసి వస్తాడు. ఏంటి తాగొచ్చావా అని రామలక్ష్మి అడుగుతుంది. కాళీ గా ఉంటున్న కదా అవమానం భరించలేక తాగుతున్నా.. ఇక రోజు తాగుతా అని ధన అంటాడు. ఒరేయ్ నీతో సీతా సర్ బిజినెస్ పెట్టిస్తాను.. పెట్టుబడి పెడతానని నీకు అంత విలువ ఇస్తుంటే అవమానిస్తున్నాడు అంటున్నవేంటి బుద్ది లేకుండా అని రామలక్ష్మి అంటుంది. అయిన నువు ఇప్పుడు గ్రేట్ బిజినెస్ మ్యాన్ భార్యవి అయిపోయావ్ కదా.. అయినా నీకేం తెలుసు నా బాధ అని ధన అంటాడు. నీ ప్రేమ కోసం ఎంత త్యాగం చేసింది మర్చిపోయావా? ఇంకొకసారి ఇలా మీ అక్క గురించి తప్పుగా మాట్లాడకని ధనకి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఆ తర్వాత అదంతా చూస్తున్న శ్రీవల్లి.. ఆ ధనని తాగేసి వచ్చావని ఆ చెంప ఈ చెంప వాయించకుండా ఇలా అన్నారని అంటుంది. ఇప్పుడు అక్కాతమ్ముల్ల మధ్య గొడవ మొదలయింది దాన్ని ఇంకా పెద్దది చెయ్యాలి. దాంతో సీతాకాంత్, రామలక్ష్మిల మధ్య మనస్పర్థలు వస్తాయ్.. దాంతో రామలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని శ్రీవల్లితో శ్రీలత అంటుంది. మా తమ్ముడు అలా మాట్లాడినందుకు సారీ అని సీతాకాంత్ కి  రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు సందీప్ రామలక్ష్మి పెట్టిన నగలు దొంగతనం చేస్తాడు. ఎవరు చూడలేదు ఇక మల్లేష్ అప్పు తీర్చాలని సందీప్ అనుకుంటాడు.

ఆ తర్వాత మాణిక్యం, రామలక్ష్మికి ఫోన్ చేసి.. ఇంటి బయట ఉన్నాను రమ్మని చెప్తాడు. రామలక్ష్మి వెళ్లి మాణిక్యంతో మాట్లాడుతుంది. డబ్బులు కావాలి ఒక 500 ఇవ్వమని అంటాడు. దాంతో రామలక్ష్మి ఇస్తుంది. అదంతా పై నుండి శ్రీవల్లి ల, శ్రీలత చూస్తుంటారు. రామలక్ష్మి చాటుగా మాణిక్యంతో మాట్లాడడం.. శ్రీవల్లి వీడియో తీస్తుంది. మరొకవైపు ఎందుకు తాగి వచ్చావంటూ ధనతో సిరి గొడవపడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఇందాక రూమ్ లో లేవ్.. ఎక్కడికి వెళ్ళావని సీతాకాంత్ అడుగుతాడు. నాన్న వచ్చి తాగడానికి డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్తే ఏమంటారోనని.. కిచెన్ లో ఉన్నానని రామలక్ష్మి అబద్దం చెప్తుంది. రామలక్ష్మి బీరువా తాళాలు పెట్టాను కన్పించడం లేదని చూస్తుంది. సీతాకాంత్ కింద పడి ఉన్న తాళాలు ఇస్తాడు. నేను టేబుల్ పై తాళాలు పెట్టాను. ఇక్కడికి ఎలా వచ్చాయని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.