ఎపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేశ్ చంద్రలడ్డా

ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది.సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆయన స్థానంలో లడ్డాను నియమించింది.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్హా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అనంతరం, ఆయనను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 
ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు.