సైలెంట్‌గా రష్మీ.. ఆది సెటైర్లు... అసలు ఏమయ్యింది!

 

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్  గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో చూస్తే ఫుల్ ఎంటర్టైన్ చేసేదిగా కనిపిస్తోంది. ఐతే ఈ షో ఆది, నాటీ నరేష్ కలిసి దొంగలుగా నటించారు. ఇక నాగదేవత జాతర జరిపించి ఆ ఊరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఈ జాతరను నిర్వహించడానికి రష్మీని, ఇంద్రజాను పిలిపించారు. వాళ్ళు ఎంటర్టైన్ చేయిస్తూ ఉన్నారు. ఈ షోలో కొంతమంది తెలంగాణ జానపద పాటలు పాడి అలరించారు. అలాగే బులెట్ భాస్కర్, రాకెట్ రాఘవకు మధ్య ఒక గేమ్ నిర్వహించారు.

ఇక డాన్సర్ పండు వేసిన డాన్స్ ఐతే ఇరగదీసింది.. అందరూ ఆ డాన్స్ కి మెస్మొరైజ్ ఐపోయారు. అలాగే లాస్ట్ లో ఆది అంత్యాక్షరి ఆడించాడు. అందులో పాట మధ్యలో ఒక వర్డ్ మిస్ అవుతుంది. అదేంటో కనిపెట్టి పాట పాడాలన్నమాట. ఆ కాంటెస్ట్ కూడా ఆది నిర్వహించాడు. ఇక రోహిణి ఒక పాట పాడింది. ఐతే ఆ పదం తప్పుగా పాడేసరికి ఆది సెటైర్స్ వేసి నవ్వించాడు. ఐతే ఈ ప్రోమోలో ఎవరూ గమనించని ఒక ట్విస్ట్ ఉంది. ఏ ప్రోమోలో ఐనా సరే రష్మీ గలగలా మాట్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేస్తూ, తన మీద వేయించుకుంటూ ఉంటుంది. కానీ ఈ వారం రాబోయే షోలో రష్మీ చాల సైలెంట్ గా ఉంది. కారణం ఏంటో తెలీదు కానీ ప్రోమో మొత్తంలో ఆమె అసలు మాట్లాడని లేదు. మరి రష్మీ సైలెన్స్ వెనక కారణం ఏమిటో తెలీదు.