Farmer Nethra : బిగ్ బాస్ 8 కి ఫార్మర్ నేత్ర!

 

బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం అందరికి తెలసిందే. శివాజీ, యావర్, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ , శుభశ్రీ రాయగురు , నయని పావని , అశ్విని శ్రీ .. ఇలా అందరు క్రేజ్ ఉన్నవారే కాబట్టి ఆ సీజన్ గ్రాంఢ్ గా సక్సెస్ అయింది. ఇక తర్వాతి సీజన్-8 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సీజన్ కి ఎవరు వెళ్ళే అవకాశం ఉందని అంటుంటే.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఫార్మర్ నేత్ర వెళ్లే అవకాశం ఉంది.


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఫార్మర్ నేత్ర(Farmer Nethra) .. వారధి ఫామ్స్( vaaradhi ) ని సొంతంగా స్టార్ట్ చేసిన నేత్ర అటు ప్రమోషన్స్.. ఇటు సేల్ తో బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య వారధి ఫామ్స్ లోని మామిడికాయలో ప్రమోషన్ లో‌ భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో  నేత్ర ఓ వీడియో చేయగా అది ఫుల్ వైరల్ అవుతోంది.  చిన్న రసాలు, పెద్ద రసాలు, నవని, బెంగినపల్లి అంటు తన ఫామ్ లోని మామిడి పండ్ల గురించి నేత్ర చెప్పింది. అయితే ఈ వీడియోని తీసుకొని సోషల్ మీడియా ట్రోలర్స్ ఇతర వీడియోలు చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఫార్మర్ నేత్రే కన్పిస్తుంది.  తనకి ఇన్ స్టాగ్రామ్ లో 103K ఫాలోవర్స్ ఉన్నారు. తను ఏ రీల్ చేసిన మినిమమ్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ గా మారిన సెలబ్రిటీని బిగ్ బాస్ తీసుకురాకుండా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. ఫార్మర్ నేత్ర ఈ బిగ్ బాస్ - 8 కి వెళ్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మోటివేషనల్ స్పీకర్ వంశీతో పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలకే వాళ్ళు విడిపోవడంతో ఫార్మర్ నేత్ర మరింతగా వైరల్ అయింది.