గుప్పెడంత మనసు సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1114 లో.... వసుధార వచ్చి ఎండీ పదవి ఇవ్వండి అని అసలు చెప్పదు.. ఎందుకంటే కాలేజీ గురించి ఆయనకేం తెలియదని ధరణి అంటుంటే.. ధరణిపై దేవయాని కోప్పడుతుంది. ధరణి వాళ్లకి ఇక బుద్ది రాదు. నువు వెళ్లి పని చూసుకోమని ఫణీంద్ర పంపిస్తాడు. ఇక ఎండీ గురించి పక్కన పెట్టి ఏదైనా సాధించే ప్రయత్నం చెయ్ అని శైలంద్రతో ఫణీంద్ర అంటాడు. మరొకవైపు సరోజ వాళ్ళ నాన్నకి రంగా ఇవ్వాలిసిన వడ్డీ డబ్బులు లెక్కెడుతుంటాడు. అప్పుడే సరోజ వాళ్ళ నాన్న వస్తాడు. రంగా వడ్డీ డబ్బులు ఇస్తాడు. వడ్డీ నేనే అసలు ఇచ్చేది ఉందా లేదా అని వెంటకారంగా మాట్లాడతాడు. లేదు మామ ఇస్తానని రంగా అనగానే.. నువ్వు ఇస్తావ్ నేను చూస్తానని అతను అంటాడు. అప్పుడే పెద్దావిడ మధ్యలో కలుగజేసుకొని రంగాకి సరోజకి పెళ్లి చేద్దామని అడుగుతుంది. దాని వాళ్ళ లాభం ఏంటి.. నాకేమైనా వచ్చేది ఉందా.. అసలు డబ్బులుపోవడం తప్ప అని సరోజ వాళ్ళ నాన్న సంజీవయ్య అంటాడు.

ఆ తర్వాత సరోజ కూడా రంగాని ఇష్టపడుతుందని పెద్దావిడ అనగానే.. అది వయసులో ఉంది కాబట్టి ఇష్టపడుతుంది కానీ కుదరదని సంజీవయ్య అంటాడు. నానమ్మ ఇప్పుడు పెళ్లి టాపిక్ ఎందుకు.. మీరు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్న నేను చేసుకోను.. నాకు ఇష్టం లేదని రంగా అంటాడు. ఇప్పుడు మగాడు అనిపించుకున్నావని సంజీవయ్య అంటాడు. అప్పుడే వసుధార వస్తుంది. ఎవరు ఈ అమ్మాయి.. సరోజ చెప్పింది నువ్వు కాపాడి తీసుకొని వచ్చావట ఈ అమ్మాయేనా.. తను దూర సందు లేదు మేడకేమో డోలు అన్నట్లు మీరు బ్రతకడమే కష్టంగా ఉంది.. ఇప్పుడు ఈమెనా అని సంజీవయ్య అంటాడు. మరొకవైపు జగతి ఫోటో దగ్గరికి మహేంద్ర వచ్చి ఎమోషనల్ అవుతుంటే.. అప్పుడే తన దగ్గరికి అనుపమ, మనులు వస్తారు. జరుగుతున్న విషయల గురించి మహేంద్ర బాధపడుతుంటే.. మను దైర్యం చెప్తాడు.

ఆ తర్వాత మను వెళ్తుంటే కొంతమంది రౌడీలు మను మనుపై ఎటాక్ చేస్తారు. వాళ్ళని మను కొడతాడు. ఎవరు మిమ్మల్ని పంపించారని మను అడుగగా శైలేంద్ర మిమ్మల్ని చంపమని సుపారీ ఇచ్చాడని రౌడీలు చెప్తారు. ఆ తర్వాత మను గాడి గొడవ వదిలి పోతుందని శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే మను వచ్చి.. ఏంటి షాక్ అయ్యావంటూ తను కొట్టిన రౌడీలను చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.