LATEST NEWS
ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడ గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది.  మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.  2025 సెప్టెంబరు 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు  ప్రభుత్వం  ప్రకటించింది.  రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ  అయ్యాయి. ఈ అధికారులు ముగ్గురు అఖిలభారత సర్వీసు నిబంధనల్ని పూర్తిగా  ఉల్లంఘించారని  అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైకాపా హాయంలో ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారుల  చేసిన అరాచకాలు   కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 
ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలికి కూటమి పక్షాన బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక పట్ల మఖ్యమంత్రి చంద్రబాబు సర్దుకుపోయినట్లు కనిపించినా,  ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. అందుకు అయితేళ్ల వైసీపీ పాలనా కాలంలో వీర్రాజు తెలుగుదేశం పట్ల, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరే కారణం. పొత్తు ధర్మంగా చంద్రబాబు చెప్పినా, ఆ పార్టీ క్యాడర్, ఆయన అభిమానులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. పొత్తు ధర్మం తెలుగుదేశానికేనా? బీజేపీకి, జనసేనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.  కూటమిలో భాగంగా  ఒక సీటు పొందినా, అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీలు తమ ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకున్నాయి గానీ, ఎన్నికల నాడు తమ కోసం త్యాగం చేసిన వారిని జనసేన పట్టించుకోవచ్చు గదా! పోనీ మరో మిత్రపక్షం బీజేపీ, అభ్యర్థి విషయంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం, దాని నాయకుడు చంద్రబాబు నాయుడిని కనీస ధర్మంగాననైనా సంప్రదించాలి కదా! సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తుందనే విషం బహిరంగ రహస్యమే కదా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  ీవీరెడ్డి రాజీనామా తరువాత, సోము వీర్రాజు ఎంపిక అనేది తెలుగుదేశం వర్గాలతో పాటు, సగటు రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబు వేసిన రెండో తప్పటడుగు కింద భావిస్తున్నారు.  నాయకుడు ఇంత మెత్తగా ఉంటే, రేపు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.  అయిదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు ఇస్తారని అందరూ భావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్రకటించింది. అందువల్ల పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా ఆశపెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కల్యాణ్ ప్రమేయంతో అప్పట్లో అవకాశం వదులు కున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని తాజాగా అందరూ భావించారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఒక అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అఖరి నిముషం వరకూ ప్రస్తావనే లేని బీజేపీ ఆఖరు నిముషంలో అయిదే సీట్లలో ఒకటి తన్నుకుపోవడంతో ఆశావహులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమకు పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందనీ, నామినేషన్ కు సమాయత్తం అవుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారైందని అంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా నాయకులు ఎవరైనా ఈ మార్పు వెనుక రాజకీయాలు నెరపారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ అనుచరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు నేతలు, ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు కలిసి అమిత్ షా దగ్గర బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు సీటుకు లాబీయింగ్ చేశారని ఒక ప్రచారం జరుగుతోంది.  అందుకే ఆఖరు నిముషంలో వీర్రాజు బీ ఫారం పొందడంలో కూడా హడావుడి అయ్యిందంటున్నారు.  ఏమైతేనేమి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే ఆఖరు కాకున్నా, వచ్చిన బస్ మిస్ అయినట్లుగా భావిస్తున్న ఆశావహులు మాత్రం తమ అనుచరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని సమాధానపరచలేక సతమతమౌతున్నారు. 
 సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో చుక్కెదురైంది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ తో కర్నూలు జైలుకు రావడాన్ని పోసాని హైకోర్టులో సవాల్ చేశారు. బుధవారం( మార్చి 12)  నాడు పోసాని తన అడ్వకేట్ పొన్నవోలు చేత లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత కొట్టివేసింది. పోసాని అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.  కోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు.   
ALSO ON TELUGUONE N E W S
Sonu Nigam, the renowned singer and a legend in Indian Music Industry, implicated IIFA for bowing down to political influence. He did not mince words but sarcastically pointed out for not being nominated in best male playback singers for the award. He sang Mere Dolna 3.0 from Bhool Bhulaiya 3.  While the song received immense praises all over, the singer is upset for not even being considered for nominations. The movie did win multiple awards at the event and the singer anticipated a nomination, at the least. The singer pointed out political bureucracy as he got into a tiff with Rajasthan government.    During his concert in Rajasthan, Chief Minister Bhajanlal Sharma and several politicians walked away in the middle of a song. He got upset and stated that if politicians don't time to stay till the concert ends, they should not be attending them.  So, he implied Rajasthan government influencing IIFA to not even nominate him in the category. The song has become a smashing hit upon release and many talked about how Sonu could bring different emotions in his voice while being classically strong. 
  'పుష్ప-2'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా కమిటై ఉన్నాడు. కానీ, దాని కంటే ముందు.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.   బన్నీ-అట్లీ కాంబినేషన్ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని సన్ పిక్చర్స్ నిర్మించాల్సి ఉంది. కానీ, బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లు కావడంతో ఈ మూవీ విషయంలో వెనకడుగు వేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించుకున్నట్లు తమిళ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దిల్ రాజు చేతికి వచ్చినట్లు కూడా అక్కడ మీడియాలో ప్రచారం జరుగుతోంది.   'గేమ్ ఛేంజర్'తో పాన్ ఇండియా ఆశలు నెరవేరక.. నిరాశలో ఉన్న దిల్ రాజుకి ఒక సినిమా చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని కూడా తాజాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అట్లీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.    సన్ పిక్చర్స్ తప్పుకోవడంతో బన్నీ-అట్లీ కాంబో ఫిల్మ్ దిల్ రాజు గడప తొక్కినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ విషయంలో దిల్ రాజు కూడా ఆలోచనలో పడ్డాడట.పైగా, అట్లీ కూడా ఏకంగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అందుకే దిల్ రాజు ఇంకా కమిట్ మెంట్ ఇవ్వలేదట. బడ్జెట్, రెమ్యూనరేషన్ విషయంలో కొంచెం దిగొస్తే.. అప్పుడు తాను ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగడానికి ఓకే అని దిల్ రాజు చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.  
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)ఊరమాస్ డైరెక్టర్ 'బోయపాటి శ్రీను'(Boyapati Srinu)కాంబోలో సింహ,లెజండ్,అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమాలు సృష్టించిన రికార్డుల రీసౌండ్ ఇప్పటికి అభిమానుల్లో,ప్రేక్షకుల్లో వినిపిస్తునే ఉంది.దీంతో ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ'అఖండ 2'(Akhanda 2)పై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అఖండ-2 షూటింగ్ హిమాలయాల్లో జరపడానికి యూనిట్ లొకేషన్ల వేటలో ఉందనే వార్తలువచ్చిన విషయం తెలిసిందే.అఘోర గా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు,పలు కీలక సన్నివేశాలని హిమాలయాల్లోనే  చిత్రీకరిస్తారని,ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు హిమాలయాల్లో ఎవరు చూపించని సరికొత్త లొకేషన్లలో షూట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.దీంతో అఖండ 2 అప్ డేట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తు వస్తున్నారు.షూట్ కి సంబంధించి పిక్ ఏమైనా బయటకొస్తుందేమోనని,అందులో తమ బాలయ్య గెటప్ కనిపిస్తుందేమో అని,ప్రతి రోజు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు.కానీ మేకర్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు.దీంతో అఖండ 2 అప్ డేట్ ఇవ్వాలని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తో కలిసి 14 రీల్స్(14 reels)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లు కాగా,సంజయ్ దత్,ఆది పినిశెట్టి లాంటి లెజండ్రీ నటులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.థమన్(Thaman)మరోసారి తన సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకుల చేత శివ తాండవం చేయించనున్నాడని యూనిట్ ఇప్పటికే వెల్లడి కూడా చేసింది. విజయదశమి కానుకగా  సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.    
Dil Raju, the popular producer and Telangana Film Development Corporation Chairman, addressed press about Gaddar Awards, the first Telangana Government film awards. FDC Chairman stated that the regulations and criteria have been established after several considerations and deliberation.  He stated that films released from June 2014 to December 2023 will be taken into consideration for Best Picture category for each year. Post that with slight changes in regulations, awards for 2024 films will be finalised with old school criterion. He further stated that awards' ceremony will be a grand event in April.  Dil Raju asked for unity among filmmakers and stated that the event should be made a grand success by everyone. He also announced that new awards have been created in the names of Kanta Rao and Paidi Jairaju. He stated that people who have submitted applications and fees for Simha Awards will be returned their money.  He stated that awards are a celebration of talents and they should be seen in the same manner. He asked for complete co-operation from every member of film fraternity and stated that Government is committed to honor every sort of talent in a grand manner.
తెలంగాణా(Telangana)ప్రభుత్వం తెలుగు సినిమాకి అత్యంత ప్రాధానత్యని ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది నుంచి ప్రముఖ సినీ,ప్రజాగాయకుడు,పాటల రచయిత,నటుడు,తెలంగాణ పోరాట యోధుడు అమరజీవి 'గద్దర్'(Gaddar)పేరుపై తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభ కనపర్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామని గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy)నే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు ఆ అవార్డ్స్ గురించి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్  చైర్మన్ దిల్ రాజు(Dil Raju)మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ చిత్రాలుగా నిలిచిన వాటిని ఏడాదికి ఒకటిగా ఎంపిక చేసి ఉగాది నాడు గద్దర్ అవార్డ్స్ ప్రధానం చేయబోతున్నాం.ఫీచర్‌ ఫిల్మ్‌,జాతీయ సమైఖ్యతా చిత్రం,బాలల చిత్రం,పర్యావరణం,చారిత్రక సంపద తదితర విభాగాలతో పాటు,తొలి ఫీచర్‌ ఫిల్మ్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌, సోషల్‌ ఎఫెక్ట్‌ ఫిల్మ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ,షార్ట్‌ఫిల్మ్‌ విభాగాల్లో కూడా అవార్డులను అందిస్తాం.ఇందుకు సంబంధించి ఒక కమిటీ  ఏర్పాటు చేస్తాం. ఉర్దూ సినిమాని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఉర్దూ సినిమాతో పాటు పైడి జయరాజ్‌,కాంతారావు పేర్లపై కూడా ప్రత్యేక అవార్డులు ఇవ్వబోతున్నాం.అంగరంగ వైభ‌వంగా ఈ  అవార్డుల వేడుక జరగబోతుంది.తెలంగాణ రాష్టం నుంచి వస్తున్న ఈ అవార్డ్స్ కి అందరు సహకరించాలని ఆయన కోరాడు.ఇక గద్దర్ అవార్డ్స్ అందుకోవడం తెలుగు నటులకి ఎంతో గౌరవంగా కూడా భావించవచ్చు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్మార్ హోళీ ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది. కుమౌనీ హోళీ ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది! హోళా మొహల్లా పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది. - నిర్జర.
  "ధూమపానం ఆరోగ్యానికి హానికరం..  నోటి క్యాన్సరుకి కారకం”... ఇది  మీ జీవితాలను నాశనం చేస్తుంది.... అంటూ ఎన్ని సార్లు ప్రకటనల్లో చెప్పినా, అడుగడుగునా హోర్డింగులు పెట్టి ప్రజలకి  అవగాహన  కల్పించాలని ప్రయత్నించినా సరే రోజురోజుకు స్మోకింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గట్లేదని సర్వేలు చెప్తున్నాయి.   ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదిక ప్రకారం ధూమపానం కారణంగా ప్రతీ సంవత్సరం 80 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. వీరిలో చాలామంది సిగరెట్ పొగను పీల్చిన వారే ఉంటున్నారు. అందుకే స్మోకింగ్  గురించి అవగాహన కల్పించడానికి, ఆ అలవాటు మానే విధంగా ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి ఏటా మార్చి నెలలో రెండవ బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా  జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా స్మోకింగ్ ఎంత ప్రమాదమో, నేటి తరాన్ని ఎలా నాశనం చేస్తుందో, ఊపిరిని ఆపేసే ఈ అలవాటునుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటే.. 1984లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక ఆచారంగా  'నో స్మోకింగ్ డే' మొదలైంది.  అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  ధూమపానం మానేయాలనుకునేవారికి సహాయం చేయడానికి వార్షిక ఆరోగ్య అవగాహన దినోత్సవంగా మారింది. ప్రతి సంవత్సరం నో స్మోకింగ్ డేని ఒక కొత్త థీమ్‌తో ప్రచారం చేస్తారు. 2025 సంవత్సరానికిగానూ "ఈ నో స్మోకింగ్ డే రోజున మీ జీవితాన్ని తిరిగి పొందండి”  అనే థీమ్ ఎంచుకున్నారు. నేడు భారతదేశంలో మగవారితో పాటు స్మోకింగ్ చేసే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుండటం  గమనించాలి. పాశ్చాత్య దేశాల వారిని చూసి భారతీయులు కూడా అలవాట్లను మార్చుకుంటున్నారు. క్లబ్బులు, పబ్బులు, కాఫీడేలు, బస్టాపులు, కొంతమంది స్కూళ్ళు, కాలేజీల్లో కూడా విచ్చలవిడిగా పొగ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో ఆడవాళ్ళలో పిల్లలు పుట్టటంలో సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.  స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఎంఫిసెమా, బ్రోన్కైటిస్, గుండె జబ్బులతో సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గొంతు, నోరు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ వంటి వివిధ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్మోకింగ్ అనేది కేవలం పొగతాగేవారికి మాత్రమే ప్రమాదం అనుకుంటే మీరు పొరబడినట్లే… మన  పక్కన తరచూ స్మోక్ చేసేవారు ఉంటే మనం  కూడా  స్మోక్ చేస్తున్నట్టే... నమ్మబుద్ది కావట్లేదు కదా, కానీ అదే నిజమని నిపుణులు చెబుతున్నారు. పొగతాగేవారి కంటే పక్కనుండి ఆ పొగ పీల్చేవారే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు.  బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా అమలుకి నోచుకోవడంలేదు. బహిరంగంగా పొగ తాగుతూ పట్టుబడితే తొలిసారి రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, రెండోసారి పట్టుబడితే ఐదేళ్ల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా వంటి చట్టాలు ఆచరణలో అమలుకావట్లేదు.  మరి పొగ తాగేవారికి, అది పీల్చేవారికి ఇన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టే ఈ అలవాటుని వదులుకోవటం చాలా అవసరం, ముఖ్యం కూడా. ఈ అలవాటు మానేయాలనుకునేవారికి సహకరించటం కూడా అంతే ముఖ్యం. స్మోకింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా భావించే నేటి యువతకి దాని గురించి అవగాహన కల్పించాలి. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు తర్వాత జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో అర్ధమయ్యేలా వివిధ మాధ్యమాల ద్వారా వివరించాలి. సినిమాలు, సోషల్ మీడియాల ప్రభావంతో పిల్లల అలవాట్లలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో అని తల్లిదండ్రులు కూడా ఒక గంట కనిపెడుతుండాలి. రేపటి తరాన్ని స్మోకింగ్ అలవాటు లేనిదిగా మారాలంటే మనం ఇప్పటి నుంచే  జాగ్రత్తలు తీసుకోవాలి.                                         *రూపశ్రీ.
  మార్పు మనిషి జీవితంలో చాలా సహజమైన విషయం. మార్పు వల్ల కొందరికి నచ్చినట్టు, మరికొందరికి నచ్చనట్టు జరిగిపోతూ ఉంటుంది.  సాధారణంగా కొందరు ఇతరుల కోసం మారడం జరుగుతూ ఉంటుంది.  ప్రేమించిన వ్యక్తి,  పెళ్లి చేసుకునే వ్యక్తి.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు. అధిక స్థాయిలో ఉన్నవారి ముందు.. ఇలా ఒకటనేమిటి.. చాలా సందర్భాలలో మార్పు అనేది జరిగిపోతూ ఉంటుంది. అయితే మార్పు మంచిదే కదా అని ప్రతి విషయాన్ని మార్చుకోవడం మంచిది కాదు.  ముఖ్యంగా కొన్ని అలవాట్లను ఎట్టి పరిస్థితులలోనూ మార్చుకోకూడది వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మార్చుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోవడమే అని అంటున్నారు. ఇంతకీ ఏవి మార్చుకోకూడదు తెలుసుకుంటే.. ప్రాధాన్యత.. మీరు మీ అవసరాలను ఇతరుల కంటే ముందు ఉంచితే చాలా సార్లు ప్రజలు మిమ్మల్ని స్వార్థపరులు అంటారు. కానీ గుర్తుంచుకోవసి విషయం ఏమిటంటేృ మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పటికీ స్వార్థం కాదు.  అది సెల్ఫ్ లవ్ అనబడుతుంది.  స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని,  అవసరాలను విస్మరిస్తే మనసులో మీకంటూ ఏమీ లేకుండా ఖాళీ అయిపోతుంది. అందుకే ఇతరులకు సహాయం చేయడం మంచిదే కానీ మీ ప్రాధాన్యతలు వదిలి మరీ సాయం చేయక్కర్లేదు. కలలు, ఆశయాలు.. కన్న కలలు ఏవైనా సరే. వయసు ఎంతైనా సరే.. చేయాలని అనుకున్న పనులు, సాధించాలి అనుకున్న లక్ష్యాలు ఎప్పటికీ విడవకూడదు. మీ కలలు, ఆశయాలు వదిలి ఇతరులకు నచ్చినట్టు జీవితాన్ని జీవిస్తే తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. నో చెప్పడం.. చాలామందికి మొహమాటం  ఎక్కువ ఉంటుంది.  దీని వల్ల నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు. చాలామంది ఏం చేప్పినా  దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఓకే అని చెప్పి, ఆ పనులు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఇష్టం లేని పనులు,  బాధ పెట్టే పనులు,  సమయాన్ని దుర్వినియోగం చేసే పనులు. ఇతరులకు మంచి చేయని పనులను చేయడానికి ఎప్పుడూ ఓకే చెప్పకూడదు.  సున్నితంగా నో చెప్పడం నేర్చుకోవాలి. నైతిక విలువలు.. ప్రతి మనిషి వ్యక్తిత్వాన్ని అతని నైతిక విలువలు వ్యక్తం చేస్తాయి. అబద్దం చెప్పడానికి,  మోసం చేయడానికి,తప్పు పనులు చేయడానికి, ఎదుటివారికి న ష్టం కలిగించడానికి ఎప్పుడూ ముందుకు వెళ్లకూడదు. అవి చేయకపోతే మీకు నష్టం కలిగినా సరే.. ఎప్పుడూ అలాంటి పనులు చేయకూడదు. మానసిక ఆరోగ్యం.. ఇప్పటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.  మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యక్తులు,  వాతావరణం.. పరిస్థితులు.. ఇలా ఏవైనా సరే.. వాటి నుండి దూరం వెళ్లడం మంచిది. పర్సనల్.. ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఉంటుంది.  జీవితంలో మొత్తం అంతా తెరచిన పుస్తకంలా ఉంచడం మంచిది కాదు. పర్సనల్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే పనులు,  పరిస్థితులకు దూరంగా ఉంచడం మంచిది. దయ.. దయతో ఉండటం,  ఇతరులతో దయగా ప్రవర్తించడం చాలా ముఖ్యం.  ఇది మనిషిలో సున్నిత కోణాన్ని వ్యక్తం చేస్తుంది. జాలి, ప్రేమ,  దయ లేని వ్యక్తి రాయి వంటి వాడు, కఠిన మనస్కుడు అని అంటారు.   దయ కలిగిన వ్యక్తి ఎల్లప్పటికీ మంచితనంతో ఉంటాడు. స్వంత గుర్తింపు.. ఇలా ఉండకు, అలా ఉండకు,  ఇది చేయకు, అది చేయకు.. ఇలా చాలా  మంది అంటూ ఉంటారు. ఇది కంట్రోల్ పెట్టడం అవుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి  తన సహజ స్వభావాన్ని,  సహజ గుణాన్ని కోల్పోతాడు. సొంత గుర్తింపును కోల్పోయే వ్యక్తి ఎప్పటికీ సొంతంగా బ్రతకలేడు.                                *రూపశ్రీ.
ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడ గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది.  మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.  2025 సెప్టెంబరు 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు  ప్రభుత్వం  ప్రకటించింది.  రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ  అయ్యాయి. ఈ అధికారులు ముగ్గురు అఖిలభారత సర్వీసు నిబంధనల్ని పూర్తిగా  ఉల్లంఘించారని  అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైకాపా హాయంలో ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారుల  చేసిన అరాచకాలు   కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 
ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలికి కూటమి పక్షాన బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక పట్ల మఖ్యమంత్రి చంద్రబాబు సర్దుకుపోయినట్లు కనిపించినా,  ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. అందుకు అయితేళ్ల వైసీపీ పాలనా కాలంలో వీర్రాజు తెలుగుదేశం పట్ల, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరే కారణం. పొత్తు ధర్మంగా చంద్రబాబు చెప్పినా, ఆ పార్టీ క్యాడర్, ఆయన అభిమానులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. పొత్తు ధర్మం తెలుగుదేశానికేనా? బీజేపీకి, జనసేనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.  కూటమిలో భాగంగా  ఒక సీటు పొందినా, అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీలు తమ ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకున్నాయి గానీ, ఎన్నికల నాడు తమ కోసం త్యాగం చేసిన వారిని జనసేన పట్టించుకోవచ్చు గదా! పోనీ మరో మిత్రపక్షం బీజేపీ, అభ్యర్థి విషయంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం, దాని నాయకుడు చంద్రబాబు నాయుడిని కనీస ధర్మంగాననైనా సంప్రదించాలి కదా! సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తుందనే విషం బహిరంగ రహస్యమే కదా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  ీవీరెడ్డి రాజీనామా తరువాత, సోము వీర్రాజు ఎంపిక అనేది తెలుగుదేశం వర్గాలతో పాటు, సగటు రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబు వేసిన రెండో తప్పటడుగు కింద భావిస్తున్నారు.  నాయకుడు ఇంత మెత్తగా ఉంటే, రేపు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.  అయిదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు ఇస్తారని అందరూ భావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్రకటించింది. అందువల్ల పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా ఆశపెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కల్యాణ్ ప్రమేయంతో అప్పట్లో అవకాశం వదులు కున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని తాజాగా అందరూ భావించారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఒక అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అఖరి నిముషం వరకూ ప్రస్తావనే లేని బీజేపీ ఆఖరు నిముషంలో అయిదే సీట్లలో ఒకటి తన్నుకుపోవడంతో ఆశావహులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమకు పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందనీ, నామినేషన్ కు సమాయత్తం అవుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారైందని అంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా నాయకులు ఎవరైనా ఈ మార్పు వెనుక రాజకీయాలు నెరపారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ అనుచరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు నేతలు, ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు కలిసి అమిత్ షా దగ్గర బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు సీటుకు లాబీయింగ్ చేశారని ఒక ప్రచారం జరుగుతోంది.  అందుకే ఆఖరు నిముషంలో వీర్రాజు బీ ఫారం పొందడంలో కూడా హడావుడి అయ్యిందంటున్నారు.  ఏమైతేనేమి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే ఆఖరు కాకున్నా, వచ్చిన బస్ మిస్ అయినట్లుగా భావిస్తున్న ఆశావహులు మాత్రం తమ అనుచరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని సమాధానపరచలేక సతమతమౌతున్నారు. 
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో చుక్కెదురైంది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ తో కర్నూలు జైలుకు రావడాన్ని పోసాని హైకోర్టులో సవాల్ చేశారు. బుధవారం( మార్చి 12)  నాడు పోసాని తన అడ్వకేట్ పొన్నవోలు చేత లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత కొట్టివేసింది. పోసాని అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.  కోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు. 
    హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి,  స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు.  రంగులు చల్లుకుంటూ  పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట.  ఇది మన మానసిక స్థితి,  శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి,  ఆశావాదం కలుగుతాయి.  హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా  శారీరక, మానసిక,  భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి.  హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి?   కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక,  శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు,  లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది.  మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి.   కలర్ థెరపీ  ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని,  ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం,  దూకుడును కూడా పెంచుతుంది.  కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి.   పసుపు రంగు పసుపు అనేది సానుకూలత,  తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం,  సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది,  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ,  ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.   ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి,  సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె,  ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం,  శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు,  అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.  టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.   కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు.  ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి.  దుస్తులు,  వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్,  అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి.                                                       *రూపశ్రీ.  
    హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే  ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం,  స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం  ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం ,  ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.  అయితే సింథటిక్ రంగులు,   ఆస్తమా,  శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం,  తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి  కారణాలకు దారి తీయవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే.. కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు,  హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి,  కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.  పొడి రంగులలో లేదా గులాల్‌లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కంటి వైద్యులు ఏం చెప్తున్నారు.. హోలీ సమయంలో,  తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు  కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు,  మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ,  మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు,  అలెర్జీలకు కారణమవుతాయి. హోలీ తర్వాత  కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి? హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే  కళ్ళకు ఉపశమనం కలిగించడానికి  సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి,  చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్‌ను చేయాలి.  కళ్ళను శుభ్రపరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి.  తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి. వెంటనే కళ్లు  చల్లగా కావడం కోసం  మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి.        *రూపశ్రీ.  
  స్కిప్పింగ్  కేవలం పిల్లల ఆట అని  అనుకుంటే పొరబడ్డట్టే. ఇది  శారీరక దృఢత్వాన్ని అద్భుతంగా పెంచే గొప్ప కార్డియో వ్యాయామం అని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ వినియోగ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా స్టామినా,  శక్తి స్థాయిలు రెండూ మెరుగుపడతాయి. స్కిప్పింగ్ సరదాగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జిమ్ అవసరం లేదు, మంచి నాణ్యమైన తాడు,  కొంచెం ఖాళీ స్థలం ఉంటే సులభంగా చేయవచ్చు.  ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే   గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట.  కేలరీలు కరిగిపోతాయి, మొత్తం శరీరంలోని కండరాలు చురుగ్గా మారుతాయి. ఇంకా రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. స్కిప్పింగ్ అనేది అధిక-తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం. దీని వల్ల  గుండె,  ఊపిరితిత్తులు బలపడతాయి . స్కిప్పింగ్  వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్  ప్రసరణకు సహాయపడుతుంది.  రన్నింగ్  లేదా సైక్లింగ్ పట్ల ఆసక్తి లేకపోతే స్కిప్పింగ్  మంచి ఎంపిక  అవుతుంది. మొదటి 20 సెకన్ల పాటు నెమ్మదిగా స్కిప్పింగ్ ఆడి ఆపై క్రమంగా  వేగాన్ని పెంచాలి. రెండు నుండి మూడు నిమిషాల సెట్లలో 5 నుండి 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయవచ్చు.  క్రమంగా  సమయం, వేగం రెండింటినీ పెంచుకోవచ్చు. బరువు తగ్గడానికి..  బరువు తగ్గాలనుకుంటే స్కిప్పింగ్ మంచి ఎంపిక. ఇది 10 నిమిషాల్లో 100 నుండి 150 కేలరీలు బర్న్ చేయగలదు. స్కిప్పింగ్  జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా శరీరం నిరంతరం కొవ్వును కాల్చేస్తుంది. ఒక నిమిషం స్కిప్పింగ్ చేసి ఆపై 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రక్రియను కనీసం 10 సార్లు రిపీట్  చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం బ్యాలెన్సింగ్.. స్కిప్పింగ్  వల్ల  చేతులు, కాళ్ళు,  కళ్ళ సమన్వయం మెరుగుపడుతుంది. ఇది  దృష్టిని,  ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. అథ్లెట్లు, నృత్యకారులు స్కిప్పింగ్ ను ఇష్టపడతారు, ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పడిపోవడం లేదా గాయపడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది శరీరంలో నాడీ కండరాల నియంత్రణను పెంచుతుంది. తద్వారా శరీర కదలికలను మెరుగుపరుస్తుంది. ఒక కాలుతో నెమ్మదిగా స్కిప్పింగ్ చేయాలి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి.  వాటిని ట్రై చేస్తూ బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు.                                *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.