పవన్ గంగిరెద్దుతో సమానమా...?
on Mar 8, 2014
పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ పార్టీ పెట్టి ప్రజల ముందుకు రాబోతున్నాడనే వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. "తెలంగాణా ప్రజలకు నా మనవి. ఇప్పుడు ఇదేదో, అదో చూసి మోసపోకండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు మాయ మచ్చింద్ర కథలు. చంద్రబాబు లాంటి వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళని చూసి మోసపోవద్దు. ఇపుడు ఇంకొకడు బయల్దేరాడు ఆడెవడో సినిమా యాక్టర్. పవన్ కళ్యాణ్. ఆ మనిషి సినిమానే చూడలేదు. అంటే నేను సినిమాలు తక్కువగా చూస్తాను. ఈయన ఎవ్వరూ అంటే చిరంజీవి తమ్ముడు అని అన్నారు. ఇక అన్నగానిది అయింది తమ్ముడి దుకాణం షురూ అయిందా ఇపుడు. సంక్రాంతి పండగకు గంగిరెద్దులోల్లు రారు. ఇది కూడా గట్లనే. ఇపుడు కూడా వస్తారు. కాబట్టి మనం మోసపోవద్దు" అని అన్నారు. మరి కెసీఆర్ చేసిన ఈ కామెంట్లకు పవన్ తో పాటు పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.