దాసరి వల్ల కాలేదు!
on Jul 3, 2013
ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో ఉండడాన్ని దర్శకత్న డా.దాసరి నారాయణరావు చాలా ఇష్టపడతారు. అందుకోసం ఆయన విమర్శించడం, విభేదించడం, ప్రశంసించడం వంటి పలు పద్దతులను ఆశ్రయిస్తూ ఉంటారు. సిబిఐ దాడులనంతరం కొన్ని రోజులపాటు (మహా అయితే రెండు వారాలపాటు) మీడియాకు దూరంగా మసలిన దాసరి. ఎక్కువ రోజులు దానిని కొనసాగించలేకపోయారు. రెండువారాలే ఆయనకు రెండు యుగాలుగా అనిపించినా ఆశ్చర్యం లేదు. అందుకే "బలుపు" చిత్రం ద్వారా ప్రచారం పట్ల తనకు గల వలపును మరోసారి ప్రకటించుకొన్నారు.
"బలుపు" చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పత్రికాప్రకటన విడుదల చేయడం ద్వారా "అయామ్ బ్యాక్" అని ఆయన తనకుతానే అనౌన్స్ చేసుకొన్నారు. దాసరి గురించి ముందునుంచి తెలిసినవాళ్లంతా.. ఈ పరిణామాన్ని ముందే ఊహించారు. సిబిఐ వ్యవహారాన్ని తనదైన వ్యవహార దక్షతో దాసరి ఓ కొలిక్కి తెచ్చుకును ఉంటారని.. ఇకపై యధావిధిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తారని దాసరి శిష్యబృందం అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో ఆ మధ్య దాసరి ప్రకటించిన అరడజనుకు పైగా చిత్రాల్లో ఒకటిరెండు చిత్రాలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముందని కూడా ఎల్క్కలు వేస్తున్నారు కొందరు పరిశీలకులు. ముఖ్యంగా.. దాసరి టైటిల్ పాత్ర పోషించే "వడ్డికాసులవాడు" సెట్స్కు వెళ్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్ద బంట్రోతుగా పని చేసే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తడం "వడ్డికాసులవాడు" చిత్రం కథాంశం కావడం గమనార్హం!