గురివిందగింజకు కిందేముందో తెలీదు!

Publish Date:Sep 4, 2012

Advertisement

పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ తెలీదు. కానీ.. ఆయన నోరు విప్పితే సొంత భజనతో పాటు సోనియా భజనకూడా చేస్తూనే ఉంటారని కార్యకర్తలు ఖరాఖండిగా చెప్పేస్తారు. బీసీలపై ఉన్నట్టుండి ప్రేమపుట్టుకొచ్చిన బొత్స .. జనాభాప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తారా అంటూ టిడిపికి, వై.ఎస్.ఆర్ . సి.పికి సవాల్ విసిరారు. నిజంగా బొత్సకి బీసీలమీద అంత ప్రేముంటే సొంతపార్టీలోనే ఈ సమస్యను పరిష్కరించి చూపించొచ్చుగా.. మరెందుకని ముందుడుగు వేయడంలేదు.? అసలాయనకు తనెంతకాలం పీసీసీ పీఠంమీద కూర్చుంటారోకూడా తెలీని పరిస్థితి. అంజనం వేసి చూసినా అంతుచిక్కని పరిస్థితి.

 

 

నిజంగా బీసీలకోసం పాటుపడాల్సొస్తే క్రెడిట్టంతా పూర్తిగా కిరణ్ కే పోతుంది తప్ప తనకేమీ దక్కదన్న సత్యాన్ని సత్తిబాబు ఎప్పుడో కనిపెట్టేశాడు. అందుకే ఆయనకి ఈ విషయంగురించి ఆలోచించే ఓపికా, తీరికా రెండూ లేవు. తిలో ఉన్న పని చేసుకోవడం చాతకాదుగానీ, ఎదుటివాళ్లని విమర్శించడంమాత్రం బాగా తెలుసు.. అంటూ ప్రతిపక్షాలు సత్తిబాబుమీద మండిపడుతున్నాయ్. కుటుంబసభ్యులతో టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులన్నీ నిండిపోతున్నాయంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రెండుపార్టీలవాళ్లకూ అరికాలిమంట నెత్తికెక్కేలా చేశాయ్. సోనియా వారసుడిగా రాహుల్ పార్టీ పగ్గాల్ని చేపట్టడానికి ఉత్సాహం చూపించట్లేదా సత్తిబాబూ.. ముందు కింద ఏముందో చూసుకుని తర్వాత ఎదుటివాళ్ల గురించి విమర్శించడం నేర్చుకో అంటూ గురివిందగింజ సామెతను గుర్తుచేస్తున్నారు ప్రతిపక్షాల నేతలు.

By
en-us Political News

  
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.