పాదయాత్ర ముహూర్తం జగన్ని ముంచుతుందా..?

Publish Date:Nov 9, 2017

Advertisement

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ చేయని ప్రయత్నం లేదు..  విమర్శలు , వ్యూహాలు ఒకటా రెండా ?  ఏవి జనాలలో అతని చరిష్మాని పెంచలేదు . దాంతో  తను తన పరివారం ఏమి చేసినా తెలుగుదేశం హవా ఆపలేకపోతున్నాం అని భావించి  ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌ను రంగం లోకి దింపాడు . కానీ  నంద్యాల ఎన్నికలతో ప్రశాంత్ సీన్ అర్థమైపోయింది. 

 

దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వున్న జగన్ కి ఎవరు ఇచ్చారో గాని సలహా, పాదయాత్ర మొదలు పెట్టాడు.. ఒకప్పుడు తన తండ్రి కి అధికారం కట్ట బెట్టింది ఆ పాద యాత్రే కాబట్టి , ఇప్పుడు తనకి కూడా అది కలసి వస్తుంది అనుకున్నాడో ఏమో తన కాళ్ళకి పని చెప్పాడు . 

 

ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. అయితే జగన్ ఏ ముహూర్తాన్న పాదం కదిపాడో గాని సమస్యలు ఒకటొకటి గా అతనిని చుట్టుముట్టడం మొదలు పెట్టాయి . మొదటి రోజే ప్యారడైజ్ పేపర్లతో  జగన్ పేరు మారుమోగింది . అంతేనా రెండో రోజు కి నడుముకి బెల్ట్ తో కనిపించాడు. ఇంకేంటి ? సోషల్ మీడియా జగన్ ని టార్గెట్ చేసి వార్తలు రాసేసింది.

 

ఇంకెంత కాలం ఇతని పాద యాత్ర సాగాదంటూ కొంతమంది జోకులు వేయటం మొదలు పెట్టారు కూడా . తెలుగుదేశం అనుకూల శ్రేణులు కూడా  సోషల్ మీడియా లో జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్ర తో జనాలలో పేరు తెచ్చు కుందామనుకుంటే వున్న పేరు పోయి అభాసుపాలు అయ్యేటట్టు వుంది . దీనికంతటికి కారణం ఏంటయ్యా అని కొందరు వైకాపా అభిమానులు   పండితులు ను కలసి ఆరా తీసారుట. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జాతకం.. ప్రస్తుతం జరుగుతున్న దశ, అంతర్దశలను పరిశీలిస్తే అతను పాదయాత్ర ప్రారంభించిన  ముహూర్తం ఏమంత బలంగా లేదంటున్నారు పండితులు. 
మరి పరిష్కారం ఏంటి అంటే ?  జగన్ ఈ యాత్ర జరిగినంత కాలం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని,.. 

 

సీఎం చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించటం మీద కంటే .  ప్రజల .. సమస్యలపైనే ద్రుష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు .. అంతేకాదు..టైం బాలేదు కాబట్టి అనేక సమస్యలు చుట్టు ముట్టే అవకాసం వుంది కాబట్టి జాగ్రత్త గా వుండాలి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు .. మరి జగన్ యోదుడిలా పోరాడుతాడా ? వెనక్కి తిరిగుతాడా ? కాలమే నిర్ణయించాలి . 
 

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.