ఛీ .. ఛీ సిగ్గేస్తోంది మంత్రి రోజా తీరుపై మహిళల ఆగ్రహం

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆమె స్వతహాగా సినిమానటి ... ఒకప్పటి హీరోయిన్... నటన ఆమె వృత్తి ... అందువలన ఆమె ప్రవర్తన అలా ఉందని కాదు. అలాగే, నటీనటులు, హీరోలు, హీరొయిన్’లు అంతా ఒకేలా , సభ్యత, సంస్కారం మరిచి  అంతే అసభ్యంగా ప్రవర్తిస్తారని అసలే కాదు. కానీ, ఇటు సినిమా రంగంలో, అటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న, మాజీ నటీ, ప్రస్తుతం మంత్రి రోజా కాస్త చాలా బోల్డ్ టైపు లేడీ, ఎవరినీ లెక్కచేసే రకం కాదు. అది ఎవరో ఆమెకు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఆమె స్వయంగా తనకు తాను ఇచ్చి పుచ్చుకున్న  కితాబు . ఆపైన సుదీర్గ కాలం ‘జబరస్త్’ టీవీ షో లో జడ్జిగా,పగలబడి నవ్వడం (కొంత మంది గిట్టని వాళ్ళు వెకిలిగా, అసభ్యంగా,అసహ్యంగా నవ్వడం అని కూడా అంటారు) బాగా ప్రాక్టీసు చేశారు.

సరే, ఆ షో ‘ఎలా ఉంటుంది .. ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యంగా ఉంటుంది అనేది వేరే  విషయం వేరే చర్చ. కొంత మంది  అయితే బూతు కామెడి షో లన్నిట్లోకి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ నెంబర్ వన్, షో అని అంటారు.అలాగే,  బూతు కామెడి షోలకు  ‘జబర్దస్త్’ పెట్టింది పేరని అంటారు. సరే, ఎవరు ఏమనుకున్నా, ఆ షోను జనం విరగబడి చూస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. లోకో భిన్న రుచి హి.. ఎవరి ఎవరి టేస్ట్ వారిది. కొంత మందికి అలాంటి కామెడీనే బాగుంతుంది. అందులో రోజా ఒకరు. 

అయితే ఆమె, మరో సెలబ్రిటీ అయితే అదోరకం.. కానీ, ఆమె ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి  పైగా ‘గౌరవ’ మంత్రి... సో ఆమె  గౌరవం. ఆమెకు మాత్రమే సొంతం కాదు. శ్రీ శ్రీ అన్నట్లుగా, ‘మీమీ వ్యక్తిగత జీవితాలు, మీమీ సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్నట్ల్గు ఆమెను ప్రవర్తనను ప్రశ్నించ వలసి వస్తోందని అంటున్నారు. 

ఆమె నటిగా ఉన్నత కాలం, జబర్దస్త్ షో .. జడ్జిగా ఉన్నంతకాలం పూర్వాశ్రయంలో ఆమె ఏమి  చేశారు అనేది, ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఇప్పడు ఆమె కేవలం ఒక నటి, జబర్దస్త్ షో .. జడ్జి మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన స్థానలో ఉన్న మహిళా. ఒక మంత్రి. సో.. ఆమె కొంత హుందాగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆశించడంలో తప్పులేదని సంన్యులు బావిస్తున్నారు. అయితే,  అదేమీ దురదుష్టమో. పాత వాసనలు ఆమెను వదలడం లేదులా  వుంది. వెనకటి వేషాలే వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమే, గతంలో జబర్దస్త్ వేషాల గురించి విమర్శలు వచ్చినప్పుడు, ఆమె, నటన తమ వృత్తని. దర్శకులు చెప్పిన విధంగా నటించడమే తమ కర్తవ్యమని, నట జీవితం వేరు, నిజ జీవితం వేరు .. రెంటిని ముడి పెట్టి చూడరాదని, తమ ప్రవర్తనను సమర్ధించుకున్నారు.

అయితే. రోజా మంత్రి అయినా, ఆమె ప్రవర్తనలో, మాట తీరులో మార్పు రాలేదనేది, ఇప్పడు ఆమె పై వస్తున్న ప్రధాన విమర్శ. నిజానికి, ఆమె మంత్రిగా చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. ఆమాట కొస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ ఏ పాటిదో వేరే చెప్ప నక్కర లేదు, అందుకే, హేమాహేమీలకే దిక్కులేదు, రోజా అనగా ఎంత, అని ఆమె అనుచరులే, ఆమె ముఖం మీద కాకున్నా, చాటుగా నవ్వుకుంటున్నారు. 

అయితే ఇప్పడు ఇంతలా ఆమె గురించి మాట్లాడుకోవడానికి, భీమవరంలో జరిగిన మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకల వేదిక పై ఆమె ప్రవర్తించిన తీరే కారణమని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధనమంత్రి, ముఖ్యంత్రి సమక్షంలో ఆమె ప్రవర్తన  మంత్రి పదవికి హుందా తెచ్చేలా లేదని విమర్శకులు అంటున్నారు. నిజం ఎవరో విమర్శించారని కాదు, ప్రధానమంత్రితో సెల్ఫి తీసుకోవాలనే కోరిక సహజంగా ఎవరికైనా ఉంటుంది. అయితే, అందుకు సమయం, సందర్భం ఉంటుందనే స్పృహ లేకుండా, ఆమె మంత్రి అనే విషయం  మరిచి పోయినట్లు ఆమె ప్రవర్తన ఉందని విమర్శకులు తప్పు పడుతున్నారు. చివరకు ముఖ్యమంత్రి  చికాకు పడే వరకు,ఆమె సెల్ఫి ‘గోల’ ఆపక పోవడం విమర్శలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు.  

అదొకటి అలా ఉంటే, మంత్రి అయిన తర్వాత, ఇటీవల కాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు,  ఆమెను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆమె ఇమేజ్ ని మరింతగా దిగజారుస్తున్నాయని, సిగ్గుతో తలవంచు కుంటున్నామని సామాన్య మహిళలు కూడా అంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేపులు పెరిగిపోతున్నాయని, అంటే, ఏంటి, ఒకటి రెండు రేపులకే అంత ఇదై పోవాల, గోల చెయాల అంటూ ఆమె ఇచ్చిన సమాధానం, మహిళలు తల వచుకునేలా ఉందని మహిళలే ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. చివరకు, అల్లూరి జయింతి ఉత్సావాలను ఆమె తమ ప్రవర్తనతో  అపవిత్రం చేశారని.. కార్యక్రమం స్పూర్తిని అగౌరవ పరిచే విధంగా మంత్రి రోజా ప్రవర్తన ఉందని, ప్రతిపక్షాలు కాదు ప్రజలు,ముఖ్యంగా మహిళలు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఇక ముందైనా, రోజా, పాత వాసనలు వదిలిచుకోవడం మంచిదని లేదంటి మంత్రి పదవి పోయినా మరకలు మాత్రం అలాగే ఉంటాయని, ఆమె మంచికోరేవారే అంటున్నారు. ఆమె వింటారా?

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.