Publish Date:Feb 15, 2025
2024 ఎన్నికలలో ఘోర పరాజయంతో వైసీపీ పనైపోయిందన్నది స్పష్టమైపోయింది. నభూతో న భవిష్యత్ అన్న రీతీలో ఐదేళ్ల అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించి జనం మీ సేవలింక చాలు అని విస్పష్టంగా జగన్ కు తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వాళ్లందరూ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించి, తమ తప్పులకు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించాల్సిన రోజు ఎప్పుడొస్తుందో అన్న భయంతో బతుకీడుస్తున్నారు.
ఇప్పటికే పలువురు జగన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావించి, వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీలలో చేరిపోయారు. అలా అవకాశం లేని విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీ యాలకే గుడ్ బై చెప్పేశారు. అదే దారిలో మరింత మంది ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ కూడా అవసరం లేదు... స్వయంగా జగన్ పార్టీ నుంచి మరి కొందరు వెళ్లిపోయేలా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై మాట్లాడిన జగన్ ఆ సందర్భంగానే విజయసాయిలా క్యారెక్టర్ లేని మరో ఇద్దరు ముగ్గురు పార్టీని వీడిపోతారని చెప్పేశారు. వైసీపీ పరిస్థితి అలా తయారైంది. ఏ నాయకుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి ఉంది. జగన్ వినా మరెవరికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న నమ్మకం వీసమెత్తైనా లేని పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఈ తరుణంలో చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే. అటువంటి బాలినేని పార్టీ పరాజయం తరువాత వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. అటువంటి బాలినేనితో విడదల రజినీ ఇటీవల బేటీ అయ్యారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీంతో విడదల రజనీ జనసేన బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 విజయం సాధించిన విడదల రజినీకి జగన్ తన క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యి కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకున్న విడదల రజినీ మంత్రి హోదాలో దోచుకో.. దాచుకో అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సరే 2024 ఎన్నికలు వచ్చే సరికి విడదల రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చేశారు జగన్. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనీ, జనం ఆమెను ఓడించాలన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అందుకే ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారనీ అప్పట్లో వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పాయి. సరే 2024 ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పరాజయం పాలయ్యారు. జగన్ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పటి నుంచీ విడదల రజనీ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అక్రమ వసూళ్లపై ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం భయంతో నోరుమెదపని బాధితులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమెపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా రజినీపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వీడి సేఫ్ జోన్ లోకి వెళ్లాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ కావడంతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమైనట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-former-minister-vidadala-rajani-leave-ycp-39-192924.html
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.