వైసీపీ సెంటిమెంట్ డ్రామాలు బెడిసికొడుతున్నాయ్!

Publish Date:Feb 15, 2025

Advertisement

వైసీపీ ఆవిర్భావమే సెంటెమెంటును అడ్డం పెట్టుకుని జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ లో ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని తండ్రిని కోల్పోయిన కొడుకును అంటూ జనంలోకి వచ్చారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకంటే సుదీర్ఘ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు  మీ వైఎస్సార్ బిడ్డను అరెస్టు చేశారంటూ రోడ్లపైకి వచ్చి అప్పట్లో సెంటిమెంట్ పండించారు. ఇన్ని చేసినా 2014 ఎన్నికలలో జగన్ పార్టీ అధికారంలోకి రాలేదు.

దీంతో ఆ  తరువాత 2019 ఎన్నికలలో విజయం కోసం జగన్ ఎన్నో సానుభూతి డ్రామాలు ఆడారు. కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు వంటి సంఘటనలతో సానుభూతి వెల్లువెత్తింది. జగన్ పార్టీకి విజయం దక్కింది. అయితే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లూ  పాలన అంటే బటన్లు నొక్కడమే అన్నట్లుగా పాలించారు జగన్. అభివృద్ధిని విస్మరించి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు  అడ్డాగా మార్చేశారు. 2024 ఎన్నికల ముందు కూడా సెంటిమెంట్ పండించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను జనం నమ్మలేదు. గులకరాయి దాడి అంటూ కంటి వద్ద పెద్ద బ్యాండేజీ కట్టుకుని ప్రచారం చేసినా జనం నవ్వుకున్నారే తప్ప అయ్యో పాపం అనలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత.. చట్టం, న్యాయం అంటూ మాట్లాడుతుంటే జనం పట్టించుకోవడం లేదు.  

తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు ద్వారా సానుభూతి పండిద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదు. పైపెచ్చు సొంత పార్టీలోనే వంశీ అరెస్టు పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లకు వంశీకి తగిన శాస్తి జరిగింది అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.   

గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వంశీ అరెస్టై 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కెడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీయులు అరెస్టు అన్యాయం, అక్రమం, చట్టానికి తూట్లు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం నవ్వి  పోతున్నారు. అధికారంలో ఉండగా గుర్తుకురాని ఈ పదాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా అని ఎగతాళి చేస్తున్నారు. అదలా ఉంచితే...

వంశీ సతీమణి పంకజశ్రీ తన భర్త అరెస్టును ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.  అంతకు ముందు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తుండగా, ఆమె తన సొంత వాహనంలో పోలీసుల కాన్వాయ్ ను అనుసరించారు. అయితే  పోలీసులు మార్గ మధ్యంలో ఆమెను నిలువరించి అదుపులోనికి తీసుకున్నారు. ఆ తరువాత వదిలేశారు. అనంతరం ఆమె  కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అదే పోలీసు స్టేషన్ లో పోలీసులు వంశీని విచారిస్తున్న సమయంలో ఆమె పోలీసు స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారనీ, అరెస్టుకు కారణం కూడా చెప్పలేదనీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సెంటిమెంట్ ను పండించేందుకు శతధా ప్రయత్నించారు. 

అధికారం కోల్పోయిన తరువాత గత ఎనిమిది నెలలుగా వైసీపీ సెంటిమెంటును పండించేందుకు ఈ వ్యూహాన్నే అనుసరిస్తోంది. సోషల్ మీడియాలో బూతు, రోత పోస్టులతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ లను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో కూడా వారి భార్యలు మీడియా ముందుకు వచ్చి అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ రెండు సందర్భాలలోనూ, ఇప్పుడు వంశీ అరెస్టు సందర్భంగానూ కూడా వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపలేదు.  

By
en-us Political News

  
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.