బోసడీకే అంటే అర్థం తెలుసా? బూతా? కాదా?

Publish Date:Oct 20, 2021

Advertisement

బోసడీకే. ఏపీలో ట్రెండింగ్ ప‌దం. కొంద‌రికి ఈ ప‌దం పాత‌దే అయినా.. చాలామందికి ఈ ప‌దం ఇప్పుడే తెలిసింది. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి బోసిడీకే అనే ప‌దాన్ని వాడటం.. అది ర‌చ్చ ర‌చ్చ‌కు దారి తీయ‌డం.. ఏపీలో తీవ్ర ఉద్రిక్త‌త‌ను రాజేసింది. వైసీపీ రౌడీ మూక‌లు.. టీడీపీ కార్యాల‌యాల‌పై ప‌డి విధ్వంసం సృష్టించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ దాడుల‌ను సీఎం జ‌గ‌న్ స‌మ‌ర్థించ‌డం, ప‌లువురు మంత్రులు మ‌ళ్లీ టీడీపీనే బెదిరించ‌డం.. పోలీసులు సైతం ఏకంగా నారా లోకేశ్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌పై హత్యాయ‌త్నం, అట్రాసిటీ కేసులు న‌మోదు చేయ‌డం.. చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌కు దిగుతుండ‌టం.. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను డిమాండ్ చేయ‌డం.. ఇలా ఏపీ రాజ‌కీయాలు రావ‌ణ‌కాష్టంలా ర‌గులుతున్నాయి. ఇంత‌టి ర‌చ్చ రంభోలాకు కార‌ణం.. ప‌ట్టాభి వాడిన బోసిడీకే అనే ప‌దం. ఇంత‌కీ బోసీడీకే అంటే అర్థం ఏంటి? అది తిట్టేనా? లేక‌, మ‌రేదైనా మీనింగ్ ఉందా? అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. 

తాజాగా, బోసిడీకే ప‌దానికి అర్థం ఏంటో వివ‌రించారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రఘురామ తెలిపారు. 

‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనే ప‌దానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.

By
en-us Political News

  
అమెరికాలోని ఆక్లాండ్ కౌంటీలో వుండే ఒక పెద్దాయనకి రెగ్యులర్‌గా లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు వుంది. ఆయన ఎప్పుడూ మెగా మిలియన్స్ అనే పేరు వున్న లాటరీ టిక్కెట్లే కొనేవాడు. వేరే కంపెనీ టిక్కెట్లు కొనమంటే కొనేవాడు కాదు..
వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా అక్రమాలతో చెలరేగిపోయిన ఆ పార్టీ నేతల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మన కేఏ పాల్ లాంటి పెద్దమనిషి కెనడాలో కూడా ఒకాయన వున్నాడు. ఆయన పేరు హామెల్.
గత కొంతకాలంగా బిఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు , ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా దూసుకెళ్తుంది
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని, రిమాండ్ కు తరలించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే తనను మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ జూన్ 26న ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా ఆయన తప్పుబడుతూ కోర్టుకెక్కారు.
అమెరికాలో ఒక తల్లి.. నలుగురు పిల్లలతో కలసి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ నలుగురు పిల్లలూ ఒక మ్యాన్‌హోల్లో పడిపోయారు.
వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఎపిలో ఓ మంత్రి కాళ్లు కడిగి పెన్షన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నీట్ యూజీ ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ణాన ప్రదర్శనకు తహతహలాడిపోతున్నారు. తాను మంత్రిగా ఉండి పాడుబెట్టిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తూ చంద్రబాబు ప్రజలలో తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకుంటుంటే.. ఓర్వలేని తనంతో, దుగ్ధతో ఆయన తన అజ్ణాన ప్రదర్శనకు మెరుగులు పెట్టి మరీ నవ్వుల పాలౌతున్నారు.
ఇంతలో ఎంత మార్పు. అవమానించిన వాళ్లే ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతున్నారు. రాజకీయంగా అణిచివేయాలని వ్యూహాలు పన్నిన వారే ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. కాలం అన్నిటినీ మార్చేస్తుంది.
బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్‌ని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టేసింది.
ఇంతకాలం మనం వింటూ వచ్చిన ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఇక వుండదు. దాని స్థానంలో బీఎన్ఎస్ - భారతీయ న్యాయ సంహిత వచ్చింది.
వైసీపీ ప్ర‌భుత్వంలో చ‌క్రంతిప్పిన నేత‌ల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత‌ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఒక‌రు. ఐదేళ్ల కాలంలో రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏం చెబితే అధికారులు అది శాస‌నంగా భావించి చేశారు. ఇందు కోసం నిబంధనలు, నియమాలు, మంచీ, చెడూ అన్నీ పక్కన పెట్టేశారు. తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో , కనుసైగ ఆదేశాలతో అనేక‌ సార్లు దాడులు జ‌రిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.