వివాదాస్పదమైన నీట్ పరీక్షలు రద్దయి ఎట్టకేలకు రీ ఎగ్జామ్ కు నోచుకున్నాయి. అయితే ఇవ్వాళ నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ యూజీ ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. తమ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET/ లో రివైజ్డ్ ఫలితాలను అందుబాటులో ఉంచామని.. రీ ఎగ్జామ్ రాసిన వారితోపాటు ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులంతా రివైజ్డ్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్ టీఏ తెలిపింది. అయితే ఎన్ టీఏ వర్గాల సమాచారం ప్రకారం తాజా ఫలితాలతో టాపర్ల సంఖ్య తొలిసారి ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గినట్లు తెలిసింది. మొత్తం 1,563 మంది విద్యార్థులకుగాను 813 మందే జూన్ 23న రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 750 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు మినహాయించగా వచ్చే పాత స్కోర్ కే కట్టుబడతామని ఇప్పటికే తెలిపారు.
ఎంబీబీఎస్ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పేపర్ కాస్త ఆలస్యంగా ఇవ్వడం వల్ల పరీక్ష సమయం కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు వారు సాధించిన స్కోర్ కు అదనంగా 5 గ్రేస్ మార్కుల చొప్పున ఎన్ టీఏ కలిపింది.
అయితే దీనిపై ఇతర విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించి టాపర్లుగా నిలవడం, కొన్నిచోట్ల పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, జూలై 6 నుంచి జరిగే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ను నిలిపేయాలని కోరారు. అయితే ఈ డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది.
మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ టీఏ డైరెక్టర్ ను ఆ పదవి నుంచి తప్పించింది. అలాగే దీనిపై అంతర్గత దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కు సంబంధించి బిహార్ లో పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసు దర్యాప్తును కేంద్రం సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/neet-re-exam-results-released-39-179762.html
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు.
టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణ వినిపించాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది.
లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది.
తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు.
తొలుత నుంచి వివాదాస్పద వ్యక్తి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు.
ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.
ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.