అమెరికాలో ఒక తల్లి.. నలుగురు పిల్లలతో కలసి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ నలుగురు పిల్లలూ ఒక మ్యాన్హోల్లో పడిపోయారు. దాంతో ఆ తల్లి విలవిలలాడిపోయింది. సహాయం కోసం తల్లడిల్లిపోయింది. ఆ తల్లి బాధని అక్కడున్నవాళ్ళు చూశారు. వెంటనే స్పందించారు. ఫైర్ ఫైటర్స్.కి ఫోన్ చేశారు. ఫైర్ ఫైటర్స్ మెరుపు వేగంతో వచ్చారు. ఒక్కళ్లు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు వచ్చారు. వీళ్ళే కాకుండా ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఫైర్ ఫైటర్స్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మాన్హోల్లోకి దిగారు. నలుగురు పిల్లల్నీ కాపాడారు. థాంక్గాడ్... నలుగురు పిల్లలకీ ఏమీ కాలేదు.. చాలా సేఫ్గా వున్నారు. పరుగు పరుగున తల్లి దగ్గరకి వెళ్ళారు. పిల్లలు క్షేమంగా బయటపడేసరికి ఆ తల్లి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తన పిల్లల్ని కాపాడిన ఫైర్ ఫైటర్స్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఆనందంగా తోక ఊపింది. అంతా బాగానేవుంది కానీ, ఈ తోక ఊపడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ తల్లి ఎవరో కాదు.. బాతు.. ఫైర్ ఫైటర్స్ కాపాడింది మరెవర్నో కాదు.. బాతు పిల్లల్ని. అమెరికాలో అంతేనండీ... ఎవర్ని కాపాడ్డానికైనా రెడీగా వుంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ducklings-rescue-operation-in-usa-39-179769.html
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు.
టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణ వినిపించాయి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది.
లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది.
తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు.
తొలుత నుంచి వివాదాస్పద వ్యక్తి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు.
ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.
ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.