ఇసుక దందా.. బాపట్ల మాజీ ఎంపీ సోదరుడు అరెస్ట్

Publish Date:Jul 1, 2024

Advertisement

వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా అక్రమాలతో చెలరేగిపోయిన  ఆ పార్టీ నేతల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకుని ప్రశ్నించిన తెలుగుదేశం ఏజెంట్ పై దాడికి పాల్పడిన కేసులో పిన్నెల్లి అరెస్టయ్యారు. ఆయన అరెస్టయిన రోజుల వ్యవధిలోనే బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ సోదరుడు నందిగం ప్రభుదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయనను ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్దండరాయుని పాలెం వద్ద సోమవారం (జులై 1) తెల్లవారు జామున ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పోలీసులు లారీని పట్టుకున్నారు.  లారీ డ్రైవర్ ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.  విచారణలో ఈ ఇసుక అక్రమ రవాణాలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ హస్తం ఉందని తెలియడంతో తుల్లూరు పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ప్రశ్రించారు.

ఇలా ఉండగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తన సోదరుడి అరెస్టు పై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా ఉండగా గత ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి జగన్ కు అడుగులకు మడుగులొత్తే చందంగా వ్యవహరించిన అధికారులను, అలాగే అక్రమాలకు పాల్పడిన నేతలను ఉపేక్షించే ప్రశక్తే లేదని ఇప్పటికే  తెలుగుదేశం అధినేత ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి 20 రోజులు అవుతున్నా జగన్ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడంపై తెలుగుదేశం శ్రేణులలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది, ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పాదయాత్ర సందర్భంగానూ తెలుగుదేశం కీలక నేత, మంత్రి లోకేష్ పదే పదే రెడ్ బుక్ లో అక్రమార్కుల అందరి పేర్లూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే విచరణ జరపి చట్టపరంగా శిక్షిస్తామని  చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే తెలుగుదేశం కూటమి ఎవరిపైనా కక్ష సాధింపు పద్ధతిలో చర్యలు తీసుకునే ప్రశక్తే లేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో చెబుతోంది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు కూడా ఆరంభమయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందే మద్యం కుంభకోణం పై కేసు నమోదు కావడమే కాకుండా వాసుదేవరెడ్డిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించి ఆయన నుంచి మొత్తం గుట్టు రాబట్టారు. ఇప్పుడు సీఐడీ మద్యం దందా లెక్కలను తేల్చే పనిలో తలమునకలై ఉంది. 
ఇక ఇసుక మాఫియాకు సంబంధించి  అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలే ప్రశక్తేలేదని, అక్రమాలు, అక్రమార్కులకు సంబంధించిన నివేదికలు సిద్ధమౌతున్నాయనీ తెలుస్తోంది. జగన్ కు వంత పాడి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన అధికారులు దాదాపుగా జీఏడీకి అటాచ్ అయ్యారు. ఇలాంటి వారంతా  ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు వద్దకు వచ్చి ఓ బొకే అందించి, తమదేమీ లేదనీ అంతా జగన్మాయేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.

అయితే చంద్రబాబు మాత్రం వారి అభినందనలు స్వీకరించడానికి, వారిచ్చిన బొకే తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో తమ పప్పులుడికేలా లేవని గ్రహించిన పలువురు అధికారులు వీఆర్ఎస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని విస్పష్టంగా చెబుతోంది. ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వీఐపీ మూకలపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితర నేతల అనుచరులపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైంది. దాడి జరిగిన రెండున్నరేళ్ల తరువాత ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక అధికారుల బృందం తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి దాడి జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి పాల్పడిన వారినే కాకుండా దాడి చేయించిన వారిపైనా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇలా జగన్  ఐదేళ్ల పాలనలో నిబంధనలకు తిలోదకాలిచ్చి, అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ఆరంభమైపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

జగన్ హయాంలోలా అడ్డగొలుగా, కక్ష సాధింపులకు పాల్పడే విధానం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరగదనీ, గీత దాటిన ఏ ఒక్కరినీ కూడా వదలి ప్రశక్తే లేదనీ, అంతా నిబంధనలకు అనుగుణంగా చట్టప్రకారం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు. 
టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణ వినిపించాయి.
 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది.
లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది.
తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరిచారు.
తొలుత నుంచి వివాదాస్పద వ్యక్తి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్  రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు.
ఏపీ సీఎంగా జూన్ 12న పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.
ఈనెల 4న మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.