చంద్రబాబు 36 గంటల దీక్ష.. వైసీపీ సంగతి తేల్చేందుకు ఢిల్లీ బాట..
Publish Date:Oct 20, 2021
![](http://www.teluguone.com/teluguoneUserFiles/img/babu%20black.jpg)
Advertisement
చంద్రబాబు.. ప్రచండ చంద్రుడిగా మారారు. టీడీపీ కార్యాలయాలపై దాడిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దాడికి ప్రతిదాడి టీడీపీ నైజం కాదు. అందుకే, సంయమనంతో ఉంటున్నారు. శ్రేణులనూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు. బుధవారం ఏపీ బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. వైసీపీ దాడులపై సర్వత్రా నిరసన జ్వాల ఎగిసిపడింది. పార్టీలకు అతీతంగా టీడీపీకి మద్దతు లభించింది. వైసీపీకి మాత్రం ఇంకా తల పొగరు దిగలేదు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ మూకలు దాడులు చేయడాన్ని సీఎం జగన్ సమర్థించుకొచ్చారు. మంత్రులు సైతం బెదిరింపులకు దిగారు. అయినా, చంద్రబాబు ఏమాత్రం రెచ్చిపోవటం లేదు. వైసీపీలా దాడులకు ఉసిగొల్పడం లేదు. పూర్తి సంయమనం పాటిస్తున్నారు. గాంధీ మార్గంలో నిరసన దీక్షలకు దిగుతూనే.. వైసీపీ అరాచకాలపై తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా నిరసన దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్యనే.. చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఇక, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ చేసిన దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఆ మేరకు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఏపీలో వైసీపీ దాడులు, రాష్ట్రంలో పరిణామాలపై అమిత్షాకు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఇక, డీజీపీకి, సీఎంకు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ‘‘40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారు. పార్టీ కార్యాలయల పైనా దాడులు ఎప్పుడూ జరగలేదు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు.. పరిస్థితి వివరించాను.’’ అని అన్నారు. ‘‘పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..? పులివెందుల రాజకీయాలు చేస్తారా..?. పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా..?. ఇది టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం కాదు. పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది..?. శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదు..?.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/chandrababu-36-hours-deeksha-and-delhi-tour-39-124874.html
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)
![](https://teluguone.com/news/images/smallthumb_img1.jpg)