ఐసిస్ లక్ష్యంగా నైజీరియాలో యూఎస్ భీకర దాడులు

Publish Date:Dec 26, 2025

Advertisement

 

గత కొంత కాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా, ఉక్రెయిన్ - రష్యా, ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్దాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఐసీస్ టెర్రరిస్టులపై అటాక్ చేసింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరకా భారీగా దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంాఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

తాజాగా  ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసీస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమాయక క్రైస్తవులపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై చర్య తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు. నైజీరియాలో క్రైస్తవ మతం అస్తిత్వానికి ముప్పు ఉందని ట్రంప్ అన్నారు. 

పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హింస కొనసాగిస్తున్నారని చెప్పారు. అలా చేస్తే భవిష్యత్ లో నరకం అనుభవించాల్సి వస్తుందని ఐసిస్ ని ముందే హెచ్చరించినట్లు పేర్కొన్నారు. మా యుద్ద వీరులు అద్భుతంగా తమ వ్యూహాలను అమలు పరిచారు. అది కేవలం యునైటెడ్ స్టేట్స్ మాత్రమే చేయగలదు. నా నాయకత్వంలో అమెరికా రాడికల్ ఇస్తామిక్ ఉగ్రవాదాన్ని పెరగనివ్వదు.

క్రైస్తవులపై దాడులు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటా. చనిపోయిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అంటూ ట్రంప్ స్పందించారు. కాగా, ఈ దాడులను యూఎస్ ఆఫ్రికా కమాండ్ ధృవీకరించింది. కాకపోతే ఎంతమంది చనిపోయారన్న విషయం వెల్లడించలేదు. ఇటీవల క్రైస్తవులపై ఐసీస్ దారుణంగా దాడులు చేసింది. మారణహోమం సృష్టించి వేల మందిని హతమార్చింది. ఈ క్రమంలోనే నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు ఐసిస్ పై దాడి జరిగినట్లు యూఎస్ మిలిటరీ ఆఫ్రికా కమాండ్ తెలిపింది.

By
en-us Political News

  
సినీ నటుడు శివాజీ ఇవాళ‌ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బీఆర్‌ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది. అలాగే అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్ ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు
జనవరి 10 రెండో శనివారం కావడం, భోగి పండుగ, జనవరి 14, సంక్రాంతి పండుగ జనవరి 15, కనుమ పండుగ జనవరి 16గా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తేదీలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని టీటీడీ సూచించింది.
మరోవైపు శివాజీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది.
ఈ సందర్భం గా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించిన తరువాత దాడులు చేసి కేసులు నమోదు చేయడం కాదనీ, తక్షణమే అంటే ఇప్పటి నుంచే హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించి డ్రగ్స్ వినియోగానికి అవకాశం లేకుండా చేయాలన్నారు.
పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది.
ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.