ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదు…శివాజీ వివరణ

Publish Date:Dec 27, 2025

Advertisement

 

ఇటీవల విడుదలైన ‘దండోరా’ సినిమా ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో సినీ నటుడు శివాజీ స్పందించారు. నోటీసులు అందుకున్న శివాజీ ఈరోజు ఉదయం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళా కమిషన్ విచారణ ముగిసిన అనంతరం కార్యాలయం నుండి బయటకు వచ్చిన శివాజీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారి తరఫున మహిళా కమిషన్ ప్రశ్నలు అడిగిందని, వాటికి తాను సమాధానాలు ఇచ్చానని శివాజీ తెలిపారు. ఎవరినీ కించపరచాలని లేదా నొప్పించాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. 

సమాజంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యం లో భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటల్లో తప్పులు దొర్లాయని అంగీకరించిన శివాజీ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసు కుంటున్నట్లు ప్రకటించారు. “భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రంగా కొనసాగుతోంది. ఎవరైనా హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవస్థలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ నేను అనవసరంగా సల హాలు ఇచ్చానని ఇప్పుడు అర్థమైంది. 

ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను” అని చెప్పారు. మహిళా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, అవసరమైతే మళ్లీ కమిషన్ ముందు హాజరవుతానని శివాజీ తెలిపారు. “కమిషన్ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తాను. అనవసరమైన ఆరోపణలకు స్పందించను” అని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు.

అయితే తనపై కుట్ర జరుగుతోందని శివాజీ ఆరోపించారు. తనతో కలిసి కెరీర్ ప్రారంభించిన కొందరికి తనపై కోపం ఉందని, తన వ్యాఖ్యల అనంతరం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొందరు జూమ్ మీటింగులు కూడా పెట్టుకున్నారని తెలిపారు. నాకు చాలా సన్నిహితులుగా భావించిన వారు కూడా ఇలా కుట్ర చేస్తారని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలని నాకు అర్థమైందని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు.

తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని శివాజీ అన్నారు. నేను ఏం తప్పు చేశానని నాపై ఇంత కోపం? తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం సహజం. ఎవరు ఎలా దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యా నించారు.

తన సినిమాకి సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఇంతటి వివాదం చెలరేగిందని శివాజీ అన్నారు. నేను సినిమాల్లో లేకపోతే వ్యవసాయం చేసుకొని బతుకుతాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు నా ఆత్మాభిమానం మాత్రమే ముఖ్యమని స్పష్టం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై ఒక వైపు రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండగా... మరోవైపు ప్రతి ఒక్కరు మహిళా కమిషన్ తదుపరి చర్యలపై ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.

By
en-us Political News

  
పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు.
బద్వేలు అర్బన్ పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేసి ఇద్దరు యువతుల తోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని సీఎం రేవంత్ తెలిపారు
జనవరి 5 నుండి దేశ వ్యాప్తంగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని సీఎం రేవంత్ తెలిపారు
కేంద్ర క్యాబినేట్‌లో నిర్ణయించకుండనే ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలిగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బీఆర్‌ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది. అలాగే అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్ ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు
జనవరి 10 రెండో శనివారం కావడం, భోగి పండుగ, జనవరి 14, సంక్రాంతి పండుగ జనవరి 15, కనుమ పండుగ జనవరి 16గా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తేదీలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని టీటీడీ సూచించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.