తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సమ్మేళనం

Publish Date:Dec 25, 2025

Advertisement

తిరుపతి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం (డిసెంబర్ 29) వరకూ నాలుగు రోజులపాటు భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరగనుంది.  తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే ఈ సమ్మేళనానికి  32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానించి, సమగ్ర అభివృద్ధి కోసం భారతీయ దృక్పథాన్ని ప్రోత్సహించే జాతీయ స్థాయి కార్యక్రమం. 

సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచ స్థాయి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో అనుసంధానం చేసి భావితరాలకు అందించే ఆశయం తో విజ్ఞన భారతీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 2007 నుంచీ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.

తొలి సమ్మేళనం భూపాల్ లో జరిగింది. ఆ తరువాత  2009 లో ఇండోర్, 2012 లో జలంధర్, 2015లో పనాజీ, 2017లో పుణే, 2023 లో అహ్మదాబాద్ లో భారతీయ విజ్ణాన సమ్మేళనాలు జరిగాయి. ఈ ఏడు తిరుపతి వేదికగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరుగనుంది. ఇందులో సదస్సులు, మేధావుల చర్చలు, చర్చా గోష్టిలు, విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఎక్స్ పో లో  వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు,  80 పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. 

ఈ  భారతీయ విజ్ణాన ప్రదర్శన ప్రారంభ సభకురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిధులుగా హాజరౌతారు.  కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే,  డీఆర్డీవో  మాజీ డైరెక్టర్ జనరల్, రక్షణ శాఖ సలహాదారులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎన్ఐఎఫ్  డైరెక్టర్ అరవింద్ రాణాడే,  దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థల డైరెక్టర్లు, వివిధ యూనివర్సిటీల వీసీలు, పరిశోధకులు  పాల్గొంటారు. ఇక 29న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరౌతారు.

By
en-us Political News

  
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు
కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.
పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.