మహానాడు వేదికపై చంద్రబాబు పక్కన ట్రాన్స్ జెండర్ ఎవరో తెలుసా?

Publish Date:May 28, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు పండుగలో ఎన్నో రాజకీయ సమీకరణాలు, భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి. అయితే.. అన్నిటికంటే మిన్నగా.. మహానాడు రెండవ రోజు వేదికపై ఆవిష్కృతమైన ఒక అపురూప దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.  మహానాడు ముఖ్య వేదికపై చంద్రబాబు నాయుడి పక్కనే ఆసీనురాలైన ఆ ట్రాన్స్ జెండర్ పేరు  వర్షిణి.

మహానాడు సభ జరుగుతున్న సమయంలో, సాధారణంగా అగ్ర నాయకులు మాత్రమే ఉండే ఆ వేదికపై చంద్రబాబు నాయుడు వర్షిణిని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎంతో ఆత్మీయంగా,  మాట్లాడారు.  చంద్రబాబు అంతటి  నాయకుడు తనతో   మాట్లాడుతూ, తన కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుంటే వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు   కనిపించాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సామాన్యులను, ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురయ్యే ట్రాన్స్ జెండర్  వర్గానికి చెందిన వారిని ఇంతగా గౌరవించడం చూసి సభికులు సైతం హర్షం వ్యక్తం చేశారు.  

ఇంతకీ ఈ వర్షిణి ఎవరు?  మహానాడు వేదికపైకి వచ్చే అవకాశం ఎలా దక్కిందనే విషయానికి వస్తే..  దీని వెనుక ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి  బరిలోకి దిగి,  మాజీ మంత్రి విడదల రజినిపై ఘన విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెట్టిన సరికొత్త ఫైర్‌బ్రాండ్ మహిళా నాయకురాలు గల్లా మాధవి పీఏ.  

గల్లా మాధవి సమాజంలో మార్పు కోసం ఒక సాహసోపేతమైన, అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ట్రాన్స్‌జెండర్ అయిన వర్షిణిని తన పర్సనల్ అసిస్టెంట్  (పీఏ)గా నియమించు కున్నారు. వర్షిణికి పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడి నాయకత్వం పట్ల ఎనలేని అభిమానం, అంకిత భావం ఉన్నాయి. తన పని పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించే వర్షిణి, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలవాలనే బలమైన కోరికను   ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద వ్యక్తం చేశారు. వర్షిణి కోరికను గౌరవించిన గల్లా మాధవి..  మహానాడు వేదికగా చంద్రబాబుతో వర్షిణి భేటీ అయ్యేలా సహకరించారు.  సమాజంలో వెనుకబడిన, వివక్షకు గురవుతున్న వర్గాలకు రాజకీయంగా మరియు సామాజికంగా సమాన గౌరవం దక్కినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని ఈ దృశ్యం నిరూపించింది.

By
en-us Political News

  
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
Police conduct scene reconstruction in lawyer murder case, Lawyers murder, Waqf Board, Advocate Moinuddin, CM Revanth reddy, Telangana goverment, DGP C.V. Anand, CP Sajjanar
కెన్యా దేశంలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకరమైన ఘోర ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.
ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవ‌ర‌ని చేస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా ప‌వ‌న్ కి, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒక‌రిచ్చిన స్థలంలో కట్టిందే.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు
రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులు వినియోగదారులకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతోంది. గృహంపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.5 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో రూ. 60,000లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.