ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠం.. భద్రత, ఆర్థిక రంగాల్లో యూఏఈ ప్రక్షాళన

Publish Date:Apr 22, 2026

Advertisement

ఇరాన్   అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతాన్ని అశాంతికి గురిచేయడమే కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా రక్షణ కవచంలో ఉన్న యూఏఈ..  ఇప్పుడు తన భద్రతా అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలపై పునరాలోచనలో పడింది.  ముఖ్యంగా ఇరాన్ యుద్ధ ప్రభావం తర్వాత.. అబుదాబి తన దౌత్య, ఆర్థిక  విధానాలను మార్చుకుంటూ చైనాకు దగ్గరయ్యేలా  అడుగులు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు యూఏఈకి రక్షణకా? భారమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  గత కొంతకాలంగా అమెరికా దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల తమకు చేకూరే ప్రయోజనం కంటే పొంచి ఉన్న ముప్పే ఎక్కువగా ఉందని యూఏఈ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈ గడ్డపై   3,500 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే..  ఇరాన్ జరిపిన డ్రోన్,  క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది. 

ఇరాన్ దాడుల కారణంగా యూఏఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వందలాది క్షిపణులు, డ్రోన్ల దాడి వల్ల దేశ మౌలిక సదుపాయాలు చిన్నాభిన్నమయ్యాయి. దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై సుమారు 120 బిలియన్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది.  విమానయాన రంగంపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.   దాదాపు 18 వేల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో  పాటు పారిశ్రామిక కేంద్రాలు, పెట్రోకెమికల్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దురదృష్టవశాత్తూ ఈ ఘర్షణల్లో పౌరులు, సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు యూఏఈ ఆర్థిక సుస్థిరత ఎంతటి ప్రమాదంలో ఉందో ప్రపంచానికి చాటిచెప్పాయి. 

ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో  కరెన్సీ స్వాప్ లైన్ మద్దతు లభించకపోవడం కూడా యూఏఈని పునరాలోచనలో పడేసింది.  సాధారణంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థలకే ఇటువంటి సదుపాయం కల్పించే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిబంధనల వల్ల యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ  డీ-డాలరైజేషన్ అంటే డాలర్ రహితీకరణ దిశగా అడుగులు వేస్తోంది.  చమురు వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ  యువాన్ ను వాడటం ద్వారా డాలర్ ఆధిపత్యానికి స్వస్తి పలకాలని యూఏఈ యోచిస్తోంది. 

గల్ఫ్ దేశాల్లో మారుతున్న ఈ పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇరాన్, అమెరికా ఘర్షణల వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు బీజింగ్ సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అబుదాబి యువరాజుతో జరిపిన చర్చల్లో  చారిత్రాత్మక మార్పుల' గురించి ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా భాగస్వామ్యం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పట్టు సడలే అవకాశం కనిపిస్తోంది. 

ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠాలతో యూఏఈ ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా చైనా, ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా.. భద్రత, ఆర్థిక రంగాల డైవర్సిఫికేషన్ అత్యవసరమని భావిస్తోంది. రాబోయే రోజుల్లో యూఏఈ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా..అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక స్వతంత్ర నిర్ణయాధికార దేశంగా ఎదిగేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి.  అమెరికా సైనిక నీడ నుంచి బయటకు వచ్చి.. సొంత రక్షణ,  ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే యూఏఈ తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది.

-సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్ట‌ప్ ఇండియా, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్ వంటి ప‌థ‌కాలు యువ పారిశ్రామిక వేత్త‌ల‌కు గొప్ప అవ‌కాశాల‌కు రాచ‌బాట ప‌రుస్తున్నాయి. నేడు భార‌త్ లో 1. 25 ల‌క్ష‌ల‌కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట‌ప్స్ ఉన్నాయి. ఇందులో స‌గానికి పైగా టూ టైర్ 2, 3 ప‌ట్ట‌ణాల నుంచి మొద‌లైన‌వి కావ‌డం విశేషం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.