ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్... అని మీకు తెలుసా? ఉద్యోగాలను వెతకడం మాత్రమే కాదు.. ఉద్యోగాల సృష్టి చేస్తోంది మన యువత. 2026 నాటికి మన వాళ్ల అత్యంత విజయవంతమైన స్టార్టప్స్ ఏవని చూస్తే.. క్విక్ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో జెప్టో- ఆదిత్య పాలిచ, కైవల్య వోహ్రా తమ 19వ ఏట ప్రారంభించిన ఈ స్టార్టప్ పది నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరి అనే కాన్సెప్ట్ తో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇది భారత దేశపు అతి పెద్ద క్విక్ కామర్స్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగి ఐపీఓ దిశగా దూసుకెళ్తోంది.
తిలక్ మెహతా అనే యువకుడు తన పదమూడో ఏట ముంబై డబ్బా వాలాల సాయంతో ప్రారంభించిన కొరియర్ సర్వీస్.. పేపర్స్ అండ్ పార్శిల్స్.. ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అంతరిక్షంలోనూ సత్తా చాటిన భారతీయ స్టార్టప్స్. స్కై రూట్ అనే సంస్థను పవన్ కుమార్ చందన, భరత్ దాకా అనే ఇద్దరు స్థాపించారు. ఈ సంస్థ ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రారంభించిన తొలి స్పేస్ స్టార్టప్. అలాగే.. అగ్నికుల్ కాస్మోస్ అని శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్ ఎస్పీఎం ప్రారంభించిన ఈ స్టార్టప్ త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్లను తయారు చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దిగంతర. అనిరుధ్ శర్మ, రాహుల్ రావత్.. తమ విద్యార్ధి దశలోనే ప్రారంభించిన ఈ సంస్థ అంతరిక్ష వ్యర్ధాలను ట్రాక్ చేసే స్పేస్ గూగుల్ మ్యాప్స్ లాంటి సాంకేతికతను ఇంప్రూవ్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ విభాగంలో సర్వం ఏఐ స్థాపించారు వివేక్ రాఘవన్. భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా ఏఐ మోడళ్లను రూపొందిస్తోందీ సంస్థ. ఇక అనిరుధ్ మిశ్రా స్థాపించిన ఆగస్ట్ ఏఐ అనే స్టార్టప్ డిజిటల్ హెల్త్ కేర్ రంగంలో ఏఐ ద్వారా విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఓలా ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ కృట్రిమ్ అనే స్టార్టప్ పెట్టగా ఇది భారతదేశపు సొంత ఏఐ మోడల్ ని తయారు చేస్తోంది. ఇక ఫిన్ టెక్ రంగానికి వస్తే.. రాజోర్ పే- హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ స్థాపించిన సంస్థ ఇప్పుడు భారత్ డిజిటల్ పేమెంట్స్ లో వెన్నుముకగా నిలుస్తోంది. ఫిజిక్స్ వాలా- అలక్ పాండే ప్రారంభించిన ఈ ఎడ్ టెక్ స్టార్టప్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తూ.. లాభాల్లో ఉన్న యూనికార్న్ గా నిలుస్తోంది. ఓయో రూమ్స్ రితీష్ అగర్వాత్ అతి చిన్న వయస్సులోనే హోటల్ పరిశ్రమలో సరికొత్త విప్లవం సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా తన బ్రాండ్ విస్తరించారు.
పైసామే ఆటో బీమా.. రేష్మిత సర్వేపల్లి, జయరామ్ సర్వేపల్లి అనే ఇద్దరు అక్కా తమ్ముళ్లు.. స్థాపించబోయే ఈ ఇన్ స్యూరెన్స్ స్టార్టప్ ఎలాంటిదంటే.. ఒక కస్టమర్ ఏ వస్తువు కొన్నా అందులోంచి ఒక శాతం మొత్తం తీసి.. దాన్నే అతడి జీవిత బీమా ఖాతాలో జమ చేసి.. వారి మరణానంతరం వారి కుటుంబానికి అంద జేయాలనుకుంటున్నారు. స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-third-largest-startup-country-36-218773.html
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్స్టా గ్రామ్లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.