Publish Date:Mar 19, 2025
ఆ క్షోభ వర్ణానాతీతం
చెమ్మగిల్లని కన్ను లేదన్నది నిజం
సుదీక్ష తల్లిదండ్రుల విలాపం
భగవంతుడా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! ఎదిగిన బిడ్డ చదువుకుంటోంది, మంచి భవిష్యత్తు ఉంటుందని, కలలు కన్నతల్లితండ్రులకు ... ఆ బిడ్డ విహారానికి వెళ్లి సముద్ర తీరం లో గల్లంతైయితే ,పది రోజులు గడుస్తున్నా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెతికినా ఆచూకీ లేకపోతే ... తమ కుమార్తె బతికే ఉంది అన్న ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లో... ఊరు కానీ ఊరిలో, సాగర తీరం లో వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం. ఆ సాగర హోరులో వారి ఘోష కూడా కలిసిపోతోంది. చివరకు ఒడ్డున దొరికిన కొన్ని దుస్తులు తో ఇంకా ఆచూకీ లభించని స్థితి లో ఆ తల్లితండ్రులు తమ బిడ్డ బ్రతికే ఉండాలి అని కోరుకుంటూనే ... ఆమె మరణ ధ్రువీకరణ పత్రం కోసం పోలీసుల్ని అభ్యర్థిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కోనంకి సుబ్బారాయుడు, శ్రీదేవి ల ఇరవై ఏళ్ళ పుత్రిక సుదీక్ష అమెరికా లోని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకుంటోంది. స్ప్రింగ్ బ్రేక్ లో మార్చి 6న డోమెనికన్ రిపబ్లిక్ లో ని పంటకాన్ బీచ్ కు ఆమె స్నేహితురాళ్లతో కలిసి విహారానికి వెళ్లారు. ఆ రోజు మిత్రుని తో కలిసి బీచ్ లో ఈతకు వెళ్లిన ఆమె సముద్రపు అలల ధాటికి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆచూకీ చిక్కని ఆమె గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆమె తల్లిదండ్రులు చివరకు ఆశలు వదులుకున్నారు. పోలీసులు మాత్రం ఆమె తో ఆఖరి దశ లో కలిసి ఉన్న వ్యక్తి ని అదుపు లో కి తీసుకుని ప్రశ్నించారు. రోజులు గడుస్తున్నా పోలీసులు అతన్ని వదిలిపెట్టలేదు. సుదీక్ష తల్లిదండ్రులు ఆ వ్యక్తి మీద తమకు ఎలాంటి ఎలాంటి అనుమానాలు లేవని తమ బిడ్డ చనిపోయిందని నమ్ముతున్నామని పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మరణ ధ్రువీకరణ పత్రం కోసం చేస్తున్న అభ్యర్ధన చూసేవారిని కంట తడి పెట్టిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sudheekshana-missing-39-194680.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.