అప్సర హత్య కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు 

Publish Date:Mar 26, 2025

Advertisement

హైద్రాబాద్ సరూర్ నగర్ కు చెందిన  అప్సర అనే యువతిని 2023 జూన్ 3న హత్య చేసిన పూజారీ సాయికృష్ణకు రంగా రెడ్డి  కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ప్రతీ రోజు అప్సర అనే యువతి ఆలయానికి వచ్చేది. ఈ  నేపథ్యంలో పూజారీతో పరిచయం ప్రేమకు దారితీసింది. పూజారి సాయి కృష్ణకు అప్పటికే పెళ్లయి పిల్లలు  ఉన్నారు. అప్సరకు  కూడా అ ప్పటికే పెళ్లయి భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో   అప్సర తమిళనాడు నుంచి హైద్రాబాద్ చేరుకుంది. అప్సరతో  అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఓకే చెప్పిన  పూజారి పెళ్లి చేసుకోవడానికి  మాత్రం నిరాకరించాడు.  ప్రతీరోజు అప్స‌ర  పూజారి సాయికృష్ణ ను  పెళ్లి చేసుకోవాలని వేధించేది.  ఎలాగో అలా  అప్సరను వదిలించుకోవాలనుకున్న  పూజారీ పథకం ప్రకారం తమిళనాడు కోయంబత్తూరు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. తన కారులోనే  శంషాబాద్ మండలంలోని సుల్తాన్ పల్లిలోని ఓ గో శాలకు తీసుకెళ్లాడు. సిసి కెమెరాలు లేవని నిర్ధారించుకుని అప్సరను హత్య చేశాడు. ముఖంపై ప్లాస్టిక్ కవర్ తో కప్పి అత్యంత పాశవికంగా పూజారి అప్సరను హత్య చేశాడు. తాను చేసిన నేరాన్ని పూజారి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. బలమైన సాక్ష్యాలతో పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేశారు.  రంగా రెడ్డి కోర్టులో ట్రయల్ ముగియడంతో  బుధవారం తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

By
en-us Political News

  
విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది.
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్‌లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట.
కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్. ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది.
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది.
గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు.
 యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్  అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు.  ఓ యువతి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
మణిపూర్ లో భూమి కంపించింది.శనివారం (మార్చి 29) మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతున ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Publish Date:Mar 29, 2025
ఎపిలో ఎండలు మండిపోతున్నాయి.  మార్చి చివరి వారంలో నాటికే మునుపెన్నడూ లేని ఊష్ణోగ్రతలు మండిపోతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో సగటున 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎపిలోని 150  మండలాల్లో 40 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటాయి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.