పవన్ ఏంటో... కాకినాడ సభ క్లారిటీ ఇచ్చిందా?

Publish Date:Sep 10, 2016

Advertisement

పవన్ కళ్యాణ్... ఈ పేరు సినిమా ప్రపంచంలో సంచలనం! మెగాస్టార్ తరువాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న విలక్షణ స్టార్ పవన్ కళ్యాణ్. అదే ఆయన రాజకీయాల్లోకి వస్తే కూడా కలకలానికి కారణమైంది. ప్రజారాజ్యం టైంలో యువరాజ్యం నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాగానే వేడి రాజేశాడు. ఆయన అప్పట్లో అన్న పంచెలు ఊడదీసే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగే! ప్రజారాజ్యం కాంగ్రెస్ లో అస్తమించటం , చిరంజీవి అదే పార్టీలో హస్తమించటం మనకు తెలిసిందే. కాని, ఎంజీఆర్, ఎన్డీఆర్ ల కాలం చెల్లిపోయిందనీ, ఇప్పుడు సినిమా వాళ్లు సీఎంలు అయ్యే ఛాన్స్ లు దాదాపు లేవని మాత్రం ఆయన నిరూపించారు. మెగాస్టార్ గా మొదలై కేంద్ర మంత్రిగా పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించారు. పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పకున్నా ప్రస్తుతం 150వ సినిమా చేస్తూ అచ్చొచ్చిన యాక్టింగ్ తిరిగి ప్రారంభించారు!

అన్నయ్య కథ ఎక్కడో మొదలై ఎక్కడో ఆగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ తన కథని ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళుతున్నాడు. ప్రజారాజ్యం ఎపిసోడ్ తరువాత చాన్నాళ్లు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ జనసేన అంటూ 2014 ఎన్నికల ముందు మన గబ్బర్ సింగ్ ప్రత్యక్షమయ్యాడు. తన పార్టీ వున్నా అభ్యర్థుల్ని రంగంలోకి దింపకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికాడు. ఇక్కడ నుంచే పవన్ రాజకీయ అపరిపక్వత కనిపిస్తూ వస్తోంది! కమ్యూనిస్ట్ అయిన చేగువేరా నుంచి ప్రేరణ పొందుతూ బీజేపి లాంటి సంప్రదాయవాద పార్టీతో జతకట్టడం ఆయన లాజిక్కే అందే విషయం. అంతే కాదు, మోదీ, బాబులకు అదికారం ఇప్పించి మరోసారి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు!

ఎన్నికల తరువాత తన మానానా తాను సినిమాలు చేసుకుని ప్రశ్నించటం ఏమైంది అంటే సమాధానం ఇవ్వలేదు పవన్. కాని, రెండున్నర ఏళ్ల తరువాత భారీ స్థాయిలో జనం ముందుకు వచ్చేశాడు. అప్పుడప్పుడూ రాజధాని రైతుల బాగోగుల గురించి మాట్లాడినా మొన్నటి తిరుపతి సభ సమయంలోనే మళ్లీ ఫుల్ టైం గా జనం ముందుకొచ్చాడు జనసేనాని!
అసలు ఒక అభిమాని చనిపోతే వెళ్లి అక్కడికక్కడే బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇది కొందరు డైనమిజం అంటుండవచ్చు. కాని, రాజకీయాల్లో ఇలాంటి ఆవేశం మంచిది కాదు. హడావుడిగా సభ పెట్టిన ఆయన ఆ రోజు పెద్దగా ఏం తేల్చకుండానే కాకినాడ సభలో అంతా చెబుతానన్నాడు. మూడు దశల్లో పోరాటం అని కూడా ప్రకటించాడు. అంతా పవన్ క్లారిటీతో వున్నాడనే భావించారు. కొందరైతే జనసేన పార్టీలో తమ బెర్త్ ల కోసం ఖర్ఛీఫులు కూడా రెడీ చేతిలో పట్టుకున్నారు. 
రాష్ట్రంలో ప్రధాన సమస్య హోదానే కావచ్చు. కాని, పవన్ ప్రత్యేక హోదాని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మిగతా వాట్ని కూడా వాడుకుంటే బావుంటుంది. కాని, కాపుల రిజర్వేషన్ లాంటి కీలకమైన అంశం కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా వుండిపోయాడు పవన్ కళ్యాణ్. అదే కాకినాడ సభలో అందర్నీ నిరాశపరిచింది. 

పవర్ స్టార్ కాకినాడ సభ కంటే ముందే కేంద్రం తనకు వీలున్నంత లాభదాయకమైన ప్యాకేజ్ ప్రకటించేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష వైసీపీ హోదానే కావాలంటూ అసెంబ్లీలో , బయట రచ్చ చేస్తోంది. ఇందరి మధ్యా పవన్ మరోసారి హోదా కావాల్సిందేనని అన్నాడు. బీజేపిని బాగా టార్గెట్ చేశాడు. కాని, టీడీపీ పట్ల కాస్త మెతకగా వున్నట్టు కనబడ్డాడు. అదంతా పక్కన పెడితే ఏవో రెండు పాచిపోయిన లడ్డూలు అన్నాడు. అవేంటో చివరిదాకా చెప్పలేదు. ఇక సభ ప్రారంభంలోనే ఏ దేశమేగినా అంటూ పాట పాడి... అది గురజాడ రాశాడంటూ తప్పుగా చెప్పాడు. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. ఇలా ఎంత మాత్రం ప్లానింగ్, ప్రిపరేషన్ లేకుండా పవన్ కాకినాడ వ్యవహారం కానిచ్చేశాడు! అవంతీ శ్రీనివాస్ ను రాజీనామ చేయమనటం మొదలు టీజీ వెంకటేష్ ను విమర్శించటం వరకూ ఏ దిక్కు, దిశా లేకుండా సాగింది పవన్ ఉపన్యాసం. 

గొంతు చించుకుని అరుస్తూ పవన్ ఎంతగా పంచ్ డైలాగ్స్ వేసినా కాకినాడ సభలో అసలు పాయింట్ మిస్సైపోయింది. కనీసం ప్రత్యేక హోదా కోసం జరిగే బంద్ లో పాల్గొనాలా వద్దా వంటి విషయం కూడా క్లియర్ గా చెప్పలేదు పవన్ కళ్యాణ్. మూడు దశల్లో పోరాటం కూడా చర్చలోకి రాలేదు. తరువాతి సభ ఎక్కడా అన్నది ఎవ్వరికీ తెలియదు! సభ అనంతరం ఒక అభిమాని చనిపోవటంతో ఇక మీదట తాను సభలు పెట్టనని పవన్ అన్నట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ అస్థిమితమైన నిర్ణయాలకి ఇది మరో తార్కాణం. రెండు సభలు ఆవేశంగా పెట్టేసి ఇక మీదట అలాంటివి వుండవు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతానికి సస్పెన్స్! అంతేనా? ఇలా అయితే, జనం సమస్యలు తీరేదెప్పుడు, వాటి కోసం జనసేన, జనసేనాని పోరాడేదెప్పుడు? ఏ పద్ధతిలో పోరాటం నడుస్తుంది? 

కాకినాడ సభతో పవన్ చాలా వరకూ తనని నమ్ముకున్న వారికి భ్రమలు తొలిగించాడు. కలగాపులంగా స్పీచ్ ఇచ్చి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఉధృతంగా దూసుకొస్తాడన్న ఆశల్ని ఆవిరి చేశాడు! ముందు ముందు మరీ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప పవన్ రాజకీయంగా కింగో, కింగ్ మేకరో అవ్వటం కష్టం...  
 

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.