కడపలో ఆపరేషన్ మొబి ట్రాక్ సక్సెస్.. రూ.70లక్షల విలువైన ఫోన్ల రికవరీ

Publish Date:Apr 9, 2026

Advertisement

కడప జిల్లాలో  ఆపరేషన్ మొబి ట్రాక్  లో  భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి.  ఈ సందర్భంగా రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ తెలిపారు. సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.

ఇప్పటివరకు మొత్తం ఎనిమిది విడతల్లో రూ.11.76 కోట్ల విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ నిచికేత్ విశ్వనాథ్ వివరించారు. మొబైల్ ఫోన్లు కోల్పోయిన వారు సంబంధిత పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ట్రాకింగ్ సులభమై వేగంగా ఫోన్లు తిరిగి పొందగలిగారని తెలిపారు. కాగా పోయిన తమ ఫోన్లు దొరికడంతో.. బాధితులు జిల్లా పోలీసులకు, ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం అపరిచిత కాల్స్, సందేశాలకు స్పందించవద్దని, మొబైల్ పోయిన వెంటనే బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డు భద్రత చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. అలాగే  సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో  సైబర్ క్రైమ్ టీం - ఇన్స్పెక్టర్  ఏ.మధు మల్లేశ్వర రెడ్డి,  సంభందిత సిబ్బంది అందరిని అభినందించడం జరిగింది. 

By
en-us Political News

  
వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను అమర్చారు.
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది.
ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూనే ఇజ్రాయెల్ పాక్ నమ్మదగిన దేశం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ పై తన దాడులను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలవి. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఒకింత అతిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ తో పోల్చారు.
దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనంగా ఉండగా, మాటల యుద్ధం మరియు సైనిక చర్యలు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి.
ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్‌ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు.
సరిగ్గా ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చాడు ముకుల్ చౌదరి. ఓటమి అంచుల్లో ఉన్న లక్నో జయింట్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించాడు.
భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు.
అంతటా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా నిలుస్తూనే ఉంది; విస్తృత ఆర్థిక దృక్పథం అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది ఒక రకమైన స్థిరత్వాన్ని అందిస్తోంది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది.
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
జైశ్వాల్ ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.