Publish Date:Apr 10, 2026
అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి.. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ టీమ్ అమెరికాకు చేరుకుంది.
శాంతి చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ ప్రతినిథుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి చర్చలు శనివారం (ఏప్రిల్ 11) నుంచి మొదలు కానున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేందుకు ఈ చర్చలు అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లో భద్రతా ఏర్పాట్ల వ్యవహారం అంతా అమెరికా చూస్తున్నది. ఇస్లామాబాద్ చేరుకోనున్న అమెరికా ప్రతినిథుల బృందం రక్షణకు సంబంధించి అమెరికా పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది.
శాంతి స్థాపన దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైన నేపథ్యంలో భద్రతా బాధ్యతలను అమెరికాకు అప్పగించిన పాకిస్థాన్.. తమ పోలీసులు, సైనిక దళాలు అమెరికా సెక్యూరిటీ బృందానికి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/islamabad-under-the-control-of-america-36-217052.html
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.