నీట్ విద్యార్థిని ఆత్మహత్య.!
Publish Date:Aug 29, 2026
Advertisement
చదువుల ఒత్తిడి మరో యువతిని బలి తీసుకుంది. నీట్ పీజీ ( సాధించి స్పెషలైజేషన్ పూర్తి చేయాలని కలలు కన్న ఓ యువతి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరుకున్నారు. నీట్ పీజీ లో మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఆర్టీసీ క్రాస్రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు నిరంతరం శ్రమించేది. అయితే.. రోజువారీ టెస్ట్ సిరీస్లలో వస్తున్న మార్కులతో నిరాశ చెందింది. ఆశించిన స్థాయిలో ర్యాంకు రాదన్న ఆందోళనతో ఆమె డిప్రషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత సేపటికీ ఆమె గది తలుపులు మూసే ఉండటంతో అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు గదిలో ఆమె స్ఫృహతప్పి పడి ఉండటాన్ని గమనించి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. చిక్కడ్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. {NEET PG Aspirant Suicide, Exam Stress Suicide, Chikkadpally Police, NEET PG Coaching Stress, Telugu One}
http://www.teluguone.com/news/content/neet-pg-aspirant-suicide-24-230228.html





