విద్యార్థులు, యువతతో ఆర్ఎస్ఎష్ చీఫ్ భేటీ.. ఎందుకంటే?

Publish Date:Aug 6, 2026

Advertisement

ఆధునిక సాంకేతిక పరిజ్ణానం విస్తరిస్తున్న వేళ, ఇండియన్ కల్చర్, నైతిక విలువల ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడమే లక్ష్యంగా ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న సదస్సుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, సీనియర్ నటి షబనాఅజ్మీ, మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వంటి వారు హాజరై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఈ భేటీ వేదికగా రాష్ట్రీయస్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ యువతతో ముఖాముఖీ నిర్వహించనున్నారు. ముంబై వేదికగా జరిగనున్న ఈ భేటీలో  మోహన్ భగత్.. జెన్ జెడ్, ‘జెన్ ఆల్ఫా వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణం, భావి తరాల నాయకత్వం,  ప్రపంచ శాంతి భారతదేశ పాత్ర వంటి కీలక విషయాలపై వారికి  మార్గనిర్దేశం చేయనున్నారు.

 నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరుగుతున్న ఈ భారీ సదస్సును  ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (ఐఐఎమ్‌యుఎన్ )అనే ఎన్జీవో నిర్వహిస్తున్నది.  ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర , భారతీయ విధానం అనే  అంశంపై  మోహన్ భగవత్   ప్రసంగిస్తారు.  మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత సంస్కృతి, జీవన విధానం ద్వారా ప్రపంచ శాంతికి ఎలా తోడ్పడవచ్చో ఆయన వివరిస్తారు.   ఈ సదస్సుకు దేశంలోని వంద నగరాల నుంచి వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.  ఐఐఎమ్‌యుఎన్  పదిహేనేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా  యువతలో దేశభక్తి, నాయకత్వ ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో ఈ   కార్యక్రమాన్ని చేపట్టింది.

 భారత మూలాలు,  సాంప్రదాయ విలువలను నవతరానికి పరిచయం చేయడమే తమ ఆశయమని ఐఐఎమ్‌యుఎన్ వ్యవస్థాపకుడు రిషబ్ షా  పేర్కొన్నారు. దేశంలోని భిన్నమైన రాజకీయ, సామాజిక సిద్ధాంతాల పట్ల యువతకు నిష్పాక్షిక అవగాహన ఉండాలని, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని ఆలోచనా ధోరణులను అధ్యయనం చేయాలని చెప్పారు.   ఈ సదస్సు వేదికగా దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన బాధ్యత యువతపై ఉందనే సందేశాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 

అదలా ఉంటే..  ఐఐఎమ్‌యుఎన్ నిర్వహించే సదస్సులో మోహన్ భగవత్ పాల్గొనడం ఇది మూడోసారి.  ఈ సదస్సుకు కేవలం ఆధ్యాత్మిక, సామాజిక రంగాల ప్రముఖులే కాకుండా చిత్ర పరిశ్రమ,కు చెందిన షబనా ఆజ్మీ, బోమన్ ఇరానీ, న్యాయవ్యవస్థకు చెందిన మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వంటి వారు కూడా హాజరౌతున్నారు.  డిజిటల్ పరిజ్ఞానంతో ముందంజలో ఉన్న జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాలకు జాతీయ భావాలను, సామాజిక బాధ్యతలను తెలియజేయడానికి ఇటువంటి వేదికలు దోహదపడతాయని పరిశీలకులు అంటున్నారు.  

Mohan Bhagwat, Gen Z Gen Alpha, RSS Chief, IIMUN Mumbai, Nation Building, Indian Youth Summit

By
en-us Political News

  
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్‌డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో  వైసీపీ  కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.