political-news-img

టవరెక్కిన ఆటో డ్రైవర్

ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఒకటి హైదరాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం జరిగింది. ఎల్‌బీ నగర్ సమీపంలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఉన్న ప్రసార భారతి రేడియో టవర్‌పై ఓ వ్యక్తి ఎక్కి నానా రచ్చ రచ్చ చేశాడు. అది చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. జానీ అనే వ్యక్తి రేడియో టవర్ ఎక్కి ముఖ్యమంత్రితో మాట్లాడే వరకు దిగనే దిగను అంటు హల్ చల్ చేశాడు. జానీ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగి స్తున్నాడు. గ్యాస్ సమస్య కారణంగా ఆటో సరిగా నడపలేకపోతున్నానని దీంతో తాను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నానొ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్యపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లా డాలని కోరాడు. అందుకే తాను టవర్ ఎక్కినట్లుగా పోలీసులకు తెలిపాడు . టవర్ ఎక్కే ముందు తన ఆటోను కింద పార్క్ చేసి పైకి ఎక్కినట్టుగా పోలీసులు గుర్తించారు.టవర్‌పైకి ఎక్కిన అనంతరం అతను డయల్-100కు కాల్ చేసి తన పరిస్థితిని తెలియ జేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వనస్థలిపురం పోలీసులు, హైడ్రా సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసి ఆటో డ్రైవర్ జానీతో సంప్రదింపులు జరిపారు.

Publish Date: Apr 4, 2026 5:20PM

political-news-img

కోహ్లీ విదేశీ ప్లేయరా?.. స్టార్ బ్యాటర్ ఏమంటున్నాడు..

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడడానికి, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసమే అతడు భారత్‌కు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్‌ లీగ్-2026 కోసం భారత్‌కు వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో గెలిపించాడు. అయితే కోహ్లీపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. లండన్‌లో నివాసం ఏర్పరుచుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐదో విదేశీ ఆటగాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సమయంలో కూడా ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ కొన్ని షరతులు పెట్టాడట. మ్యాచ్‌లకు మధ్యలో ఎక్కువ వ్యవధి ఉంటే తనను ప్రత్యేక విమానంలో లండన్‌కు పంపించాలని కోరాడట. అందుకు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కూడా ఓకే చెప్పిందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న విమర్శల గురించి కోహ్లీ స్పందించాడు . ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని చాలా మంది అంటున్నారు. మిమ్మల్ని కూడా ఆ లిస్టులో ఎందుకు చేర్చారు అనే ప్రశ్నకు కోహ్లీ స్పందించాడు. ఆ విషయం తనకు తెలియదన్నాడు. అయినా , ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నావని ఎదురు ప్రశ్నించాడు. తానేమీ ఓవర్సీస్ ప్లేయర్‌ను కానని, ఆ ప్రశ్న విదేశీ ఆటగాడిని అడగమని చెప్పాడు. అలాగే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు తాను ఎలాంటి షరతులూ పెట్టలేదని తెలిపాడు. ఇక, గత సీజన్‌లో ఆర్సీబీ కప్ గెలిచిన సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు.

Publish Date: Apr 4, 2026 5:04PM

political-news-img

స్లో ఓవర్ రేట్.. పంజాబ్ కింగ్స్‌కు భారీ పెనాల్టీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు ఆ ఆనందం లేకుండా పోయింది. చైన్నె సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండోసారి స్లో ఓవర్‌రేట్ ఎదుర్కొంది. గత ఐపీఎల్ సీజన్ ముందు వరకు కెప్టెన్‌పై మూడుసార్లు స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడితే ఒక మ్యాచ్ బ్యాన్ ఉండేది. కానీ, గత సీజన్ సమయంలో ఐపీఎల్ కొన్ని నిబంధనలు మార్చింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మూడోసారి తప్పిదానికి పాల్పడినా ఆ కెప్టెన్‌పై జరిమానా పెరుగుతుంది కాని, ఎలాంటి నిషేధం ఉండదు. అంటే మూడో సారి శ్రేయస్ అయ్యర్ ఇదే తప్పిదం చేస్తే ఆ జరిమానా రూ.36లు అవుతుంది. ప్లేయర్లపై 50 శాతం వరకూ మ్యాచ్ ఫీజులో కోత విధించే అకాశం ఉంది.

Publish Date: Apr 4, 2026 4:54PM

political-news-img

వార్ ఎఫెక్ట్.. ఏయే దేశాలకు ఎంతెంత?

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఏ ఒక్క దేశమో కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేర్వేరు స్థాయిల్లో నష్టపోతున్నాయి. అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో చూస్తే.. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రత్యక్ష నరకాన్ని, భారీ నష్టాన్ని చవిచూస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు.. దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇరాన్ కరెన్సీ- రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40శాతం దాటిపోయింది, దీనివల్ల సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందనంత భారమయ్యాయి. యుద్ధం వల్ల దేశంలో ఇప్పటికే ఉన్న నిరసనలు, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆ తర్వాత భారీగా నష్టపోతున్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్ల వల్ల ఇజ్రాయెల్ నగరాల్లో.. భారీ ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇక్కడ తామెంత నరకం అనుభవిస్తున్నామో తమకే తెలుసంటున్నారు ఇజ్రాయెలీలు. నిరంతరం సైరన్లు, బంకర్లలో గడపాల్సి రావడం వల్ల.. ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రక్షణ వ్యవస్థలు మరీ ముఖ్యంగా.. ఐరన్ డ్రోమ్ వంటి వాటి నిర్వహణకు, యుద్ధానికి ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇతర దేశాల పరిస్థితి ఏంటో చూస్తే.. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలు కూడా.. ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్- స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20శాతం నిలిచిపోయింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటాయి. ఇక ఆసియా దేశాలపై పడుతున్న భారం ఎలాంటిదో చూస్తే.. చమురు దిగుమతుల కోసం మధ్య ప్రాచ్యంపై ఆధారపడే.. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్ సరఫరా తగ్గడంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. అమెరికా తన సైనిక శక్తిని వాడటంతో పాటు, తన యుద్ధ విమానాలను- కోల్పోవడం, సైనిక ఖర్చులు పెరగడం వంటి నష్టాలను ఎదుర్కొంటోంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల పరంగా నేరుగా నష్టపోతుంటే, మిగిలిన ప్రపంచ దేశాలు పెరిగిన చమురు ధరలు, ఆర్థిక మాంద్యం భయంతో పరోక్షంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. మొత్తంగా ఏయే దేశాలకు అంకెల్లో చూపితే ఎంతెంత ఆర్ధిక భారం పడుతోంది.. మరీ ముఖ్యంగా ఇరాన్ ఖర్చు ఎంత? ఇజ్రాయెల్ ఎంత? అమెరికా ఎంత? అని పరిశీలిస్తే.. 2026 ఏప్రిల్ నాటి తాజా అంచనాల ప్రకారం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జరిగిన ఆర్థిక నష్టాలు భయానకంగా కనిపిస్తున్నాయి. కేవలం యుద్ధం చేస్తున్న దేశాలే కాకుండా, ప్రపంచం మొత్తం దీని భారాన్ని మోస్తోంది. మరీ ముఖ్యంగా.. అమెరికా అయితే ఈ యుద్ధం కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తోంది. రోజువారీగా యుద్ధ కార్యకలాపాల కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెబితే సుమారు రూ. 16 వేల 600 కోట్లు ఖర్చవుతోందని చెబుతున్నాయి నివేదికలు. యుద్ధం మొదలైన మొదటి 12 రోజుల్లోనే అమెరికా 16.5 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఏప్రిల్ మొదటి వారం నాటికిది పాతిక బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో చెబితే సుమారు రూ. 2.1 లక్షల కోట్లుగా ఉంది. యుద్ధం వల్ల ఏర్పడిన ఆయుధాల కొరతను తీర్చడానికి అమెరికా- 2027 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే.. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి భారీగా ఖర్చు చేస్తోంది. 2026 సంవత్సరానికి ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్‌ 34.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఇజ్రాయెల్ షెకెల్స్ లో చెబితే.. సుమారు 112 బిలియన్ షెకెల్స్ గా తెలుస్తోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టడానికి వాడే ఐరన్ డోమ్, ఆరో వ్యవస్థల కోసం ఒక్కో రాత్రికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. యుద్ధం వల్ల టూరిజం, టెక్నాలజీ రంగాలు బాగా దెబ్బతిని దేశ జీడీపీ వృద్ధి గణనీయంగా తగ్గింది. ఈ మొత్తం యుద్ధంలో ఇరాన్ అసలైన బాధిత దేశం. ఇరాన్ తన మౌలిక సదుపాయాలను కోల్పోవడంతో పాటు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ రియాల్ విలువ పడిపోయింది, ద్రవ్యోల్బణం 40శాతం పైగా ఉందని ముందే చెప్పుకున్నాం. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. వీటిని తిరిగి నిర్మించడానికి వందల బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో రోజుకు కొన్ని వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది ఇరాన్. భారత్ వంటి ఇతర దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉందో చూస్తే, ఇది పైకి తెలీదు. కానీ, లోలోన కార్చిచ్చులా ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తుందనే చెప్పాలి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలో 11శాతం అంటే, రోజుకు 1.1 కోట్ల బారెల్స్ కొరత ఏర్పడింది. గత నెలలోనే పెట్రోల్ ధరలు సుమారు 10 శాతం, డీజిల్ ధరలు 20 శాతం పెరిగాయి. ప్రపంచ ఎరువుల సరఫరాలో 12 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగి భారత్ వంటి వ్యవసాయ దేశాలపై భారం పడుతోంది. ఈ గణాంకాలు ప్రస్తుత యుద్ధ తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 0.3 శాతం నుండి 1శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది.

Publish Date: Apr 4, 2026 4:45PM

political-news-img

మాతో ఆడండి ప్లీజ్ .. బీసీసీఐకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్‌‌కు మధ్య దూరం పెరిగింది. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్‌తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ 20 ప్రపంచకప్‌నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది. ఐపీఎల్‌‌లో కూడా బంగ్లా జట్టు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వైఖరి మారింది. బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం. అలాగే షెడ్యూల్ ప్రకారం భారత్‌కు మా జట్టు వెళ్లాల్సి ఉంది' అని అబేదిన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది . ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 6,7 తేదీలలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సహకారంపై కూడా మాట్లాడబోతున్నట్టు సమాచారం.

Publish Date: Apr 4, 2026 4:32PM

political-news-img

నెల్లూరు నేతలను గాడిన పెడుతున్న చంద్రబాబు!

- నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం దారి తప్పిందని ముఖ్యమంత్రికి అర్ధమైంది - మంత్రి నారాయణ, ఎమ్పీ విపిఆర్‌లకు బాధ్యతల నుంచి విముక్తి - ఉదయగిరి ఎమ్మెల్యేకి తల వాచే చీవాట్లు - సూళ్లూరుపేట నేతలకు పదునైన చురకలు - దేముళ్ల సేవతో సరిపెట్టుకోవద్దని రామనారాయణరెడ్డికి సూచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా మీద సునిశిత దృష్టి సారించినట్లు అర్థమవుతున్నది. నెల్లూరు జిల్లా సాధారణంగా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైకాపాకు బలమైన స్థావరం. కానీ మొన్నటి ఎన్నికలలో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. అదొక విచిత్రం. అన్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది. అంటే.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేదా ఎంపీలలోనే తమ భవిష్యత్ మీద నమ్మకం సడలిందన్న మాట. అదేమీ ఒకరు చేసే ఆరోపణ కాదు. కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. దేనివల్ల ఈ పరిస్థితి? 30 నుంచి 75 వేల మెజారిటీతో తెలుగుదేశం ఎమ్మెల్యేలను గెలిపించిన నెల్లూరు జిల్లా ఓటర్లకు అప్పుడే ముఖం మొత్తిందా? పార్టీ మీద లేదా పదవులలో వున్న వారి మీద విరక్తి జనించిందా? అందుకు కారణం ఏమిటి? జిల్లా పరిస్థితి బాగా లేదన్న వార్తలు ముఖ్యమంత్రి చెవికి కూడా చేరినట్లున్నాయి. పడవకు పడిన లేదా పడుతున్న చిల్లుని, చిన్నదిగా వున్నప్పుడే పూడ్చకుంటే, మొత్తం పడవే మునిగిపోతుందన్న ఆలోచనతోనే, నెల్లూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లున్నారు. ఈ వారంలో రెండు ఊళ్లకు వచ్చారాయన. ఈ రెండు ఊళ్లను ఎంపిక చేసుకోవడంలో ఏదో ఒక పరమార్థం వుందని భావించాలి. మొదట సూళ్లూరుపేట. ఎమ్మెల్యే విజయశ్రీ మీద తనకు సదభిప్రాయం వుందనే సూచన ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎంబిబిఎస్ చదివిన ఉన్నత విద్యావంతురాలిగానే కాకుండా, నిరంతరం నవ్వుముఖంతో కనపడడం విజయశ్రీ విలక్షణత. ఎవరినైనా నవ్వుతోనే పలకరిస్తారు. ఆమె మీద ఆరోపణలు లేవు. అయితే సూళ్లూరుపేట నుంచి మద్రాసు నగరానికి ఎర్ర గులక, ఇసుక ఎవరు దొంగ రవాణా చేస్తున్నారో నాకు తెలుసు, వారీ అక్రమాలు తక్షణమే నిలిపివేయండి అని గట్టిగానే హెచ్చరిక చేశారు. ఎవరికి తగలాలో వారికి ఆ మాటల శూలం బలంగా గుచ్చుకున్నది. గుండె కలుక్కుమన్నది. లక్షల రూపాయల అక్రమ రాబడి ఆగిపోతుందనుకునే బాధే కదా పాపం. పనిలో పనిగా, విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి కూడా, ఇక నువ్వు రిటైర్ అయితే బాగుంటుందని నవ్వుతూనే సలహా ఇచ్చారు. ఆ మాటలో పరుషత్వం లేకపోవడంతో నెలవల సంతోష పడిపోయాడు. సూళ్లూరుపేట ఎస్‌సి నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే పసిపిల్ల కావడంతో ముదురు మనుషులు పెత్తనం చలాయిస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లుంది. కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడట, ఒక్క ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫార్సులు తప్ప ఇతరులెవరి మాటా మీరు వినాల్సిన అవసరం లేదని. ఈ మాటకు కొందరి ముఖాలలో గంటు పడింది. వెంటనే.. వింజమూరు. అక్కడికి రాకముందే స్థానిక పరిస్థితుల మీద సమగ్ర అవగాహన తెచ్చుకున్నట్లున్నారు చంద్రబాబు. ఏకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీద చర్నాకోళ ఝుళిపించారు. వాతలు పడేట్లు, మాటలు విసిరారు. రేపటి ఎన్నికలలో రాష్ట్రంలో 175 మంది తెలుగుదేశం అభ్యర్థులు గెలిస్తే, నువ్వు 172 వాడిగా ఉంటావు. ఇంత తక్కువ వ్యవధిలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను సమర్థించడం లేదు. పార్టీ కార్యకర్తలందరూ విసిగిపోయి వున్నారు. తీరు మార్చుకోవడానికి మూడు నెలల గడువు ఇస్తున్నాను, మారితే మర్యాదగా వుంటుంది, లేకుంటే చర్యలు వేరేగా వుంటాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇదేదో గదిలోకి పిలిచి, ఎవరూ వినకుండా హితబోధ చేసి వుంటే గౌరవంగా వుండేది.. కానీ, కార్యకర్తల సమావేశంలో అందరి సమక్షంలో తూర్పార పట్టడం వల్ల, పాపం కాకర్ల సురేష్ నిరుత్తరుడైపోయారు. ఉదయగిరి కార్యకర్తలు మాత్రం పండుగ చేసుకున్నారు. ఇక జిల్లాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన సవరణలు చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. అందులో ఓం ప్రథమంగా మంత్రి నారాయణకు, ఎమ్పీ విపిఆర్‌కు, మీ పనులు మీరు చేసుకోండి, జిల్లా బాధ్యత వదిలి పెట్టేయండి అని సూచించారట. ఈ సూచన సున్నితంగా, మనసు నొచ్చుకోకుండా ఉందని చెబుతున్నారు. మరి జిల్లా బాధ్యత ఎవరిది? ఆ బరువు మరొక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భుజాలపై పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ దేముళ్లు, దేవాలయాలేనా.. అప్పుడప్పుడైనా రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా అని సుతారంగా మందలించారని వినికిడి. దానిలో నువ్వే ఈ భారం మోయాలి అనే సూచన వుందని మనం భావించవచ్చు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో పట్టుజారక ముందే పరిస్థితులు చక్కదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో కలగడం కార్యకర్తలకు సంతోషం కలిగిస్తున్నది. ఆ మాత్రం రాజకీయ సవరణలు చేపడితే, పదికి పది గెలవకపోయినా, పదికి పది కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. జమీన్ రైతు సౌజన్యంతో

Publish Date: Apr 4, 2026 4:18PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img