జూన్ లో మందాకృష్ణ మాదిగ పార్టీ!

Publish Date:Apr 25, 2012

Advertisement

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జూన్ లో రాజకీయపార్టీగా అవతరించబోతోంది. జూన్ ఐదో తేదీ తరువాత పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని ఎం.ఆర్.పి.ఎస్. నాయకుడు మందా కృష్ణ మాదిగ "తెలుగువన్.కామ్''కు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

 

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబసభ్యులకు, తమ సామాజికవర్గానికి లక్షల కోట్లు దోచిపెట్టారన్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కోట్లు ఆర్జించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమలుగా విడదీసి మూడు ప్రత్యేక రాష్త్రాలు ఏర్పాటు చేయాలని అప్పుడే ఈ మూడు ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రావాడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెనక్కి రప్పిస్తామన్నారు. ఏయే శాఖలు ఈ నిధులు బదిలీ అయ్యాయో వాటినుంచి వడ్డీతో సహా రప్పించి వాటిని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.

 

 

అంబేద్కర్ ఆశయాలను కోరుకునే ప్రతి ఒక్కరూ తాము ఏర్పాటు చేయబోయే పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సమర్థుడని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అధికారాన్ని కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర మంత్రులతో సంప్రదించారనీ, కానీ ఈ విషయమై ఎన్నిసార్లు కలిసినా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించటం లేదని ఆయన ఆరోపించారు.

By
en-us Political News

  
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది.
ఆర్యవైశ్యులు సౌమ్యులు.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పండుగ పూట ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తన ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.