బీఆర్ఎస్ పోరు బాట.. లక్షమందితో కేసీఆర్ పాదయాత్ర.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ఇంత వరకూ ఒకింత స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ  హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, సాగునీటి రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అధికార పార్టీ వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకించి నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.

లక్ష మంది రైతన్నలను కలుపుకుని సాగే బృహత్తర ప్రజా ఉద్యమంలా పాదయాత్ర చేపట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.   రాష్ట్రంలోని   సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం,  పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సందర్శనలో భాగంగా ఈ పాదయాత్ర కొనసాగాలని చెప్పారు.  రైతుల సంక్షేమం, సాగునీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ పాదయాత్ర ద్వారా  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ చెప్పారు.  

ఇక అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈభేటీలో చర్చించారు. సభలో ఏయే అంశాలను లేవనెత్తాలి, అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్   దిశానిర్దేశం చేశారు. తనను అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించిన కేసీఆర్.. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు.  క్షేత్రస్థాయిలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాగా ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో  సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుల సంక్షేమ పథకాల అమలులో లోపాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మరోవైపు ప్రజల మధ్య పాదయాత్ర చేపట్టడం ద్వారా రాజకీయ ఒత్తిడిని మరింత పెంచాలన్నారు.  


[KCR Fires On CM Revanth Reddy, KCR Padayatra, BRS Party, Kaleshwaram Project, Palamuru Project, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.