వధువు మెడలో మూడు ముళ్లు.. వేసిన కల్వకుంట్ల కవిత..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

 

పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు. కానీ ఈ వివాహ వేడుకలో మాత్రం ఓ ఆసక్తికరమైన సంప్రదాయం అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్‌ పెళ్లిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆడబిడ్డగా మారి ప్రత్యేక వివాహ తంతును నిర్వహించారు. ఈసీఐఎల్‌–కీసర క్రాస్‌రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్‌లో బుధవారం బాలప్ర సాద్‌–శివాని వివాహం జరిగింది. 

బాలప్రసాద్‌కు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో.. తన వివాహంలో ఆడబిడ్డగా ఉండాలని ఆయన కవితను కోరినట్లు సమాచారం. ఆయన కోరిక మేరకు కవిత వివాహ వేడుకలో ఆడపడుచు బాధ్యతను స్వీకరించారు. ముదిరాజ్‌ సంప్రదాయం ప్రకారం.. వరుడు మంగళసూత్రం కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముదారంతో వధువు మెడలో మూడు ముళ్లు వేయించే ఆచారం ఉంది. 

అందులో భాగంగా కవిత వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధువుకు ప్రదానపు ఉంగరం తొడిగడంతో పాటు ఒడిబియ్యం పోసి ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాల ప్రసాద్‌ శివాని మెడలో మంగళసూత్రం ధరింప జేశారు. కవిత ఇలా “ఇంటి ఆడబిడ్డ”గా మారి సంప్రదాయాన్ని పూర్తి చేయడం వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

Kalvakuntla Kavitha, Telangana Rakshana Sena, Bashaboyina Balaprasada Wedding, 
ECIL, Keesara Crossroad

By
en-us Political News

  
తెలంగాణ శాసనసభలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది.
నేపాల్‌లో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ఆ వరదల్లో గల్లంతయ్యారు.
హైదరాబాద్ నగరంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన మీరాలం చెరువు సరికొత్త పర్యాటక కాంతులతో మెరిసిపోయేందుకు సిద్ధమవుతోంది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) జయరాజు ఇళ్లు, ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.