ఎంత కోటీశ్వరుడికైనా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు వున్నా, ఏ మనిషికైనా కావలసింది... కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. కడుపు నిండా తిండి ఎలాగైనా వస్తుందేమోగానీ, కంటి నిండా నిద్ర మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. నా దగ్గర బోలెడన్ని కోట్లు వున్నాయి.. నిద్రా.. రా.. అంటే నిద్ర వచ్చేయదు. పోనీ, డబ్బుంది కదా... నిద్రని కొనుక్కుందామా అంటే, అదికూడా సాధ్యమయ్యే విషయం కాదు.. నిద్ర గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
జగన్మోహన్రెడ్డి మనలాగా సాధారణ పౌరుడు. మనం దేశ సరిహద్దుల్లో సైన్యం కాపలాగా వున్నారన్న ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతాం. జగన్మోహన్రెడ్డి కూడా అంతే, తన ప్యాలెస్ చుట్టూ దాదాపు వెయ్యిమంది పోలీసులు కాపలాగా వున్నారన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతూ వుంటారు. ఒక్క పోలీసులు మాత్రమేనా.. బోలెడన్ని చెక్పోస్టులు... వందలకొద్ది సెక్యూరిటీ పరికరాలు.. ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా బారికేడ్లు... ఇక ఆయుధాల సంగతి సరేసరి. జగన్ ముఖ్యమంత్రిగా వుండగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఈ సదుపాయాలు వుండేవి కాబట్టి ఆయన హాయిగా నిద్రపోయేవారు. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి.. మరి... ఆయన ఇక హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోగలరా?
గతంలో జగన్ ఇంటి ముందు నుంచి సాధారణ పౌరులు ప్రయాణించడానికి అవకాశం వుండేది కాదు.. ఇప్పుడు అలా కాదు.. జగన్ ఇంటి ముందు వున్న రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని అధికారులు తొలగించారు. ఇప్పుడు ఎవరైనా ఆ రోడ్డులో హాయిగా ప్రయాణించవచ్చు. హై సెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగంగా వున్న ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలతో జగన్ ఇంటి చుట్టూ వున్న రోడ్లతో ప్రవేశిస్తే, వాటిని ఆపడానికి రెండు టైర్ కిల్లర్లు, నేలలో నుంచి పైకి లేచే నాలుగు హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటినీ తొలగించారు. జగన్ ఇంటి దగ్గర భద్రతకోసం అన్నట్టుగా ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. జగన్ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మొత్తం తీసేశారు. అలాగే, మొన్నటి వరకు జగన్కి సెక్యూరిటీగా వున్న దాదాపు వెయ్యిమంది పోలీసుల స్థానంలో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే మిగిలింది. జగన్ ఇంటి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది కోసం అనుమతి లేకుండా నిర్మించిన పక్కా గృహాలను, గవర్నమెంట్ ఖర్చుతో జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా త్వరలో తొలగిస్తారు. మరి, ఇంతకాలం ఇంత సెక్యూరిటీ, హడావిడి వుంటే తప్ప జగన్ నిద్రపోయేవారు కాదు.. మరి ఇకముందు జగన్కి ఎలా నిద్ర పడుతుందో ఏమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-house-security-equipment-removed-39-179917.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.
కేతిరెడ్డికి జగన్ విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా.. చేసిన పాపాలకు అసలు వడ్డీతో టి సిసలుగా ఫలితంబు అనుభవించుట తధ్యమన్నా.. అంటూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది. జీవితంలో మనంచేసే మంచి చెడులకు ఫలితాలు తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని దీని సారాంశం. ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు.
కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రిమాండ్లో వున్న రేపిస్టు సుధాకర్ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్ని కూడా పరామర్శించాలి.
ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు.
ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో చేరిపోయారు.
టెక్సాస్లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది.